BigTV English
Advertisement

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

AP Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్

  • అక్టోబర్ 15,2025 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
  • అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
  • నవంబర్ 1 నుంచి 15వ తేదీ లోపు ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
  • నవంబర్ 16 నుంచి 30లోపు పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం, సేకరణ పూర్తి చేయాలి.
  • డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు
  • డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
  • 2026 జనవరిలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల నిర్వహణ, అదే నెలలో ఫలితాలు ప్రకటన

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

మూడు నెలలు ముందుగానే ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహం చేస్తుంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటును పరిశీలిస్తుంది. ఈ మేరకు ఎస్ఈసీ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు ఇటీవల లేఖలు సైతం రాశారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలో ముగుస్తుంది. 2026 జనవరిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది.


Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×