BigTV English

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి జీతాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 3,01,116ను చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.


మరో విషయమేమంటే.. వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాశాఖలో సమస్యలు సహా అభివృద్ధి కోం తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

Also Read: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?


ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథాకలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించినటువంటి విషయాలపైనా వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×