E-Paper
Advertisement

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..
Advertisement

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి జీతాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 3,01,116ను చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.

మరో విషయమేమంటే.. వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాశాఖలో సమస్యలు సహా అభివృద్ధి కోం తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

Advertisement

Also Read: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?

ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథాకలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించినటువంటి విషయాలపైనా వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×