E-Paper
Advertisement

Balineni Srinivasa Reddy: సీఎం రేవంత్ తో ఆ వైసీపీ నేతలు.. చెడుగుడు ఆడుకున్న జగన్.. బిగ్ టీవీతో బాలినేని

Balineni Srinivasa Reddy: సీఎం రేవంత్ తో ఆ వైసీపీ నేతలు.. చెడుగుడు ఆడుకున్న జగన్.. బిగ్ టీవీతో బాలినేని

Balineni Srinivasa Reddy: ఏపీలో పొలిటికల్ బాంబులు విసురుతున్నారు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని. అది కూడా నేను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు ఆయన. ఈ దెబ్బకు వైసీపీకి మైండ్ బ్లాక్ కావాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి వివాదం రేగుతుండగా, మాజీ సీఎం జగన్ అక్రమంగా సుమారు రూ. 1700 కోట్ల వరకు లాభం పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అప్పటి విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నుండి జనసేనలో చేరిన బాలినేని కుండబద్దలు కొట్టారనే చెప్పవచ్చు. అప్పటి సీఎం జగన్ నేరుగా అదానీ గ్రూప్ తో చర్చలు జరిపారని, తనను ఏ ఒక్కరూ కలవలేదని తెలిపారు. అంతేకాదు అర్థరాత్రి ఫోన్ చేసి సంతకం పెట్టమంటే, తాను ససేమిరా అన్నట్లు.. ఇప్పుడు అదే వివాదంగా మారిందన్నారు.

అలాగే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో బాలినేని మరో కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడం విశేషం. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ గా పదవిలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ఎంపీ పదవిలో ఉండగా, అక్కడ తన తోటి ఎంపీలతో పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంతో మెలిగే వారు సీఎం రేవంత్. తెలంగాణ ఎన్నికల అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. దీనితో ఢిల్లీ లో తన తోటి ఎంపీలకు, ఎమ్మేల్యేలకు రేవంత్ రెడ్డి పార్టీ ఇచ్చారు.

Also Read: Pawan Kalyan on Pithapuram: ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు.. ఇక ఆ పెద్ద సమస్య తీరినట్లే..

ఆ పార్టీపైనే బాలినేని కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లిన వైసీపీకి చెందిన 17 మంది ఎంపీలు, ఎమ్మేల్యేలకు జగన్ 2024 ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదని బాలినేని చెప్పారు. కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లినందుకే సీటు ఇచ్చేందుకు జగన్ సుముఖత చూపలేదని, ఇదొక్కటి చాలు జగన్ నైజం తెలుసుకొనేందుకు అంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు బాలినేని. ఈ సంచలన కామెంట్స్ బాలినేని ప్రత్యేకించి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పగా.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. బాలినేని చేసిన ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×