BigTV English
Advertisement

Balineni Srinivasa Reddy: సీఎం రేవంత్ తో ఆ వైసీపీ నేతలు.. చెడుగుడు ఆడుకున్న జగన్.. బిగ్ టీవీతో బాలినేని

Balineni Srinivasa Reddy: సీఎం రేవంత్ తో ఆ వైసీపీ నేతలు.. చెడుగుడు ఆడుకున్న జగన్.. బిగ్ టీవీతో బాలినేని

Balineni Srinivasa Reddy: ఏపీలో పొలిటికల్ బాంబులు విసురుతున్నారు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం జగన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని. అది కూడా నేను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు ఆయన. ఈ దెబ్బకు వైసీపీకి మైండ్ బ్లాక్ కావాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి వివాదం రేగుతుండగా, మాజీ సీఎం జగన్ అక్రమంగా సుమారు రూ. 1700 కోట్ల వరకు లాభం పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అప్పటి విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నుండి జనసేనలో చేరిన బాలినేని కుండబద్దలు కొట్టారనే చెప్పవచ్చు. అప్పటి సీఎం జగన్ నేరుగా అదానీ గ్రూప్ తో చర్చలు జరిపారని, తనను ఏ ఒక్కరూ కలవలేదని తెలిపారు. అంతేకాదు అర్థరాత్రి ఫోన్ చేసి సంతకం పెట్టమంటే, తాను ససేమిరా అన్నట్లు.. ఇప్పుడు అదే వివాదంగా మారిందన్నారు.

అలాగే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో బాలినేని మరో కీలక కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడం విశేషం. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ గా పదవిలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ఎంపీ పదవిలో ఉండగా, అక్కడ తన తోటి ఎంపీలతో పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంతో మెలిగే వారు సీఎం రేవంత్. తెలంగాణ ఎన్నికల అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. దీనితో ఢిల్లీ లో తన తోటి ఎంపీలకు, ఎమ్మేల్యేలకు రేవంత్ రెడ్డి పార్టీ ఇచ్చారు.


Also Read: Pawan Kalyan on Pithapuram: ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు.. ఇక ఆ పెద్ద సమస్య తీరినట్లే..

ఆ పార్టీపైనే బాలినేని కీలక కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లిన వైసీపీకి చెందిన 17 మంది ఎంపీలు, ఎమ్మేల్యేలకు జగన్ 2024 ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదని బాలినేని చెప్పారు. కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లినందుకే సీటు ఇచ్చేందుకు జగన్ సుముఖత చూపలేదని, ఇదొక్కటి చాలు జగన్ నైజం తెలుసుకొనేందుకు అంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు బాలినేని. ఈ సంచలన కామెంట్స్ బాలినేని ప్రత్యేకించి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పగా.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. బాలినేని చేసిన ఈ కామెంట్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×