E-Paper
Advertisement

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం.

సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్‌ను పరిశీలించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను (EVs) కొనుగోలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెవెలుగు బస్సులంటే కేవలం సాధారణ ప్రయాణ సాధనాలుగా కాకుండా, సామాన్యులకు కూడా చల్లని ప్రయాణ అనుభూతిని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా నాణ్యత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

మరోవైపు, త్వరలో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం దృష్టి సారించారు. గోదావరి జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు దోహదపడతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. డీజిల్ ఖర్చులను తగ్గించుకుని, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు సంస్థ ఆర్థిక పరిస్థితికి మేలు జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Advertisement

ALSO READ: Rajam constituency: టీడీపీలో పొలిటికల్ ఫైట్.. రాజాంకి గ్రీష్మే దిక్కా?

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×