E-Paper
Advertisement

AP Welfare Schemes: ఏపీలో ఆగస్ట్ నెల కీలకం.. మూడు స్కీమ్స్ లకు ముహూర్తం.. మీరు అర్హులేనా?

AP Welfare Schemes: ఏపీలో ఆగస్ట్ నెల కీలకం.. మూడు స్కీమ్స్ లకు ముహూర్తం.. మీరు అర్హులేనా?
Advertisement

AP Welfare Schemes: ఏపీలో ఆగస్ట్ నెల సంక్షేమ పథకాల హోరు నెలగా మారనుంది. ప్రభుత్వం ఒకవైపు రైతులకు నగదు సాయం అందిస్తుండగా, మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలను అందించబోతోంది. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం లభించనుంది. ఇలా ఒక్క ఆగస్ట్ నెలలోనే ప్రతి వర్గానికీ ఏదో ఒక శుభవార్త చేరబోతుండటంతో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఆగస్ట్ 2, 3 తేదీల్లో అన్నదాత సుఖీభవ సాయం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్ట్ 2, 3 తేదీల్లో ఈ సాయం ఖాతాల్లో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.2,000 నగదుతో పాటు రాష్ట్రం నుండి మరో రూ.5,000 ఇవ్వనుంది. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.7,000 డైరెక్ట్‌గా జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే ప్రతి చిన్న రైతుకీ కొంత ఆర్థిక ఊరటనిచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.

Advertisement

ఆగస్ట్ 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
మహిళలకు శుభవార్త. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పల్లెటూర్లలో, పట్టణాల్లో, జిల్లాల మధ్య ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. ఈ ఫ్రీ సదుపాయం వల్ల ప్రత్యేకించి రోజువారీ ఉద్యోగాలకు, మార్కెట్లకు వెళ్లే మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుంది.

ఈ పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అర్బన్ రూట్ బస్సులు, సిటీ సర్వీసులు, ఇతర ప్రత్యేక నాన్-ఎయిర్ కండీషన్డ్ బస్సులలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వలన మహిళలపై ఉన్న ప్రయాణ ఖర్చు భారం తగ్గనుంది.

Advertisement

ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
ఆగస్ట్ 15న ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఆదాయం తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు ఈ సాయం ఒక చిన్న ఊరట ఇస్తుంది. ఆటో డ్రైవర్ల సామాజిక భద్రత, వాహనాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోంది.

Also Read: AP National Highways: నేషనల్ హైవే రేసులో ఏపీ.. న్యూ ప్రాజెక్ట్స్ ఇవే.. అసలు సంగతి ఏమిటంటే?

ఆగస్ట్ నెల ప్రత్యేకత
ఒకే నెలలో ఇలా రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకాలు అమలవడం అరుదు. రైతులకు 7 వేల రూపాయల సాయం, మహిళలకు బస్సు ఫ్రీ పాస్, ఆటో డ్రైవర్లకు ఆర్థిక ప్యాకేజ్ కలిపి ఆగస్ట్ నెలను సంక్షేమ మాసంగా మార్చాయి.

ప్రభుత్వ సంక్షేమ దిశ
కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొందింది. దీపం పథకం 2.0, తల్లికి వందనం, అన్నా క్యాంటీన, పలు పథకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆగస్ట్‌లో ఈ మూడు ప్రధాన పథకాలు.. అన్నదాత సుఖీభవ, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, ప్రజలలో మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయన్న ధోరణిలో ప్రభుత్వం ఉంది.

బంపర్ ఆఫర్లతో ఉత్సాహం
రైతుల ఖాతాల్లో 7 వేల రూపాయలు పడటం అంటే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంలో కొంత సహాయం. మరోవైపు మహిళలకు బస్సు ఫ్రీ యాత్ర అంటే కుటుంబ ఖర్చులో కొంత ఉపశమనం. ఆటో డ్రైవర్లకు సాయం అంటే వారి రోజువారీ ఆదాయంలో కొంత సౌలభ్యం. మొత్తంగా ప్రభుత్వం ప్రతి వర్గానికీ ఏదో ఒక లాభం అందించే విధానాన్ని ఆగస్ట్‌లో స్పష్టంగా చూపిస్తోంది.

ప్రజల్లో ఆశలు
ఈ పథకాల ప్రకటనలతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. రైతులు తమ ఖాతాలో డబ్బు రావాలని ఎదురుచూస్తుంటే, మహిళలు ఆగస్ట్ 15నుంచి ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా ఆర్థిక సాయం కోసం వేచి ఉన్నారు. ఈ పథకాల అమలు సరైన రీతిలో జరిగితే రాష్ట్రంలో ప్రజల సంతృప్తి పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆగస్ట్ నెలలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ప్రతి వర్గానికీ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ‘వారందరికీ డబ్బులు, మిగిలిన వారికి బంపర్ ఆఫర్ అన్నట్టుగా ఆగస్ట్ నెల రాష్ట్ర ప్రజలకు నిజంగా శుభవార్తల పరంపరగా నిలుస్తోంది. రైతులకు నేరుగా నగదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అన్నీ కలిపి సంక్షేమానికి కొత్త రూపం ఇస్తున్నాయి.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×