E-Paper
Advertisement

Balineni Srinivas Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని.. తాడేపల్లికి ఎస్పీ మల్లిక

Balineni Srinivas Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని.. తాడేపల్లికి ఎస్పీ మల్లిక

Balineni Srinivas Reddy : ఒంగోలులో పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. పంతం నెగ్గించుకున్నారు. ఓ కేసు విషయంలో పోలీసుల తీరును నిరసిస్తూ.. గురువారం నుంచి సీఎంవోలోనే ఉన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. ఎస్పీ మల్లిక ఘర్గ్‌ను తాడేపల్లి రావాలని ఆదేశించింది. నకిలీ స్టాంప్స్ కేసుల్లో పోలీసుల తీరును నిరసిస్తూ .. బాలినేని తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. గురువారం సీఎంను కలవాలని యత్నించినా..తొలుత సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. జగన్‌ ఎమ్మిగనూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాలినేని.. ఆయన్ను కలవడం కుదరలేదు. సీఎం ఆదేశాల మేరకు.. ధనుంజయ్‌ రెడ్డిని కలవాలని సీఎం ఆదేశించగా.. ఆయన్ను కలసి తాజా పరిస్థితులను వివరించారు.

కొన్నిరోజులుగా తన మాటకు విలువలేదంటూ బాలినేని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో.. జిల్లా ఎస్పీకి పిలుపురావటంతో మల్లికఘర్గ్‌ తాడేపల్లి చేరుకున్నారు. దీంతో ఇరువురితో సీఎంవో కార్యాలయం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ నిరాకరించడంతో అధిష్టానం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీ మారుతారా లేక రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు వేచిచూడాల్సిందే.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×