BigTV English
Advertisement

CID Raids In AP: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి టార్గెట్.. 20 చోట్ల సిఐడి అధికారుల తనిఖీలు..

CID Raids In AP: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి టార్గెట్.. 20 చోట్ల సిఐడి అధికారుల తనిఖీలు..

అమరావతి, స్వేచ్ఛ: CID Raids In AP: ఆంధ్రాలో పలుచోట్ల డిస్టిలరీలలో సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, విజయవాడ ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇవేగాక ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో తయారవుతున్న మద్యం బాటిలింగ్ యూనిట్ లోనూ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రేణిగుంట సమీపంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీస్ పైనా దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని పెరల్ డిస్టిలరీలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.


నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పైనా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీర్ల ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో దాదాపు 30 మంది అధికారులు పాల్గొనడం గమనార్హం.

నేడు కూడా దాడులు
కడప జిల్లాలోని ఈగల్ డిస్టిలరీ కేంద్రంలోనూ సోదాలు జరిగాయి. ఏడాదిగా ఇక్కడ పెద్ద మొత్తంలో మద్యం తయారయిందని..దానికి సంబంధించిన లెక్కలు, రికార్డులు పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ సోదాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో డిస్టిలరీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ దాడులలో వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా జారుతున్నట్లు సమాచారం.


Also Read: Puli Seetha: రోజా.. శ్యామలకు చుక్కలు చూపిస్తున్న పులి సీత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

జగన్ ప్రభుత్వంలో నెంబర్-2గా చలామణి అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రరో ఇండస్ట్రీస్ ని తన కనుసైగల్లో పెట్టుకుని జె బ్రాండ్లు పేరుతో మద్యానికి పేర్లు పెట్టి అమ్మారు. వాటికే అత్యధికంగా సప్లై ఆర్డర్లు వచ్చేలా చేశారని గతంలోనే సీఐడీ దర్యాప్తులో తేలింది.

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×