Big Stories

Another case on Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. కోర్టులో పీటీ వారెంట్..

Chandrababu naidu latest news

Chandrababu naidu latest news(Andhra pradesh political news today) :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మరో కేసు కలకలం రేపుతోంది. విజయవాడ ACB కోర్టులో ఆయనపై మరో పిటిషన్‌ దాఖలైంది. సీఐడీపై ఈ పిటిషన్‌ వేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ ను సీఐడీ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

- Advertisement -

ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టు అయ్యారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో మరోకేసును సీఐడీ తెరపైకి తేవడం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులోనూ చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో టీడీపీ అధినేతను విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ, A6గా మరో మాజీ మంత్రి నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News