Shivani Suicide: అమ్మా చాలా సారీ అమ్మా నా కోసం చాలా కష్టపడ్డావు. డాడీ నీ డ్రీమ్ నిలబెట్టలేకపోతున్నా.. నా డ్రీమ్ కూడా నెరవేర్చుకోలేకపోతున్నా. డాడీ, అమ్మా నాకు బతకాలని ఉంది కానీ, బతకడానికి చాలా రీగ్రెట్ గా ఉంది, చాలా గిల్టీగా ఉంది. అమ్మా నీ కోసం నేనేం చేయలేను. డాడీ నేను నాకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది కానీ, నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. నాతో ఈ బాధ ఒక్కదాన్నే మొయ్యడం కావట్లేదు. నేను చనిపోయాక నా పై ఎవ్వరూ కొప్పడకండి. డాడీ నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి. అమ్మా బై. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్యా డాడీ మాట విని బాగుపడు. చెడ్డ పనులు చేయకు. అన్నయ్యా- వదిన, అమ్మా, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి, సరేనా బై అంటూ చనిపోయేముందు శివాని రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
పోలవరం జిల్లా, రంపచోడవరం, ఇర్లపల్లి కొత్తకాలనీలో ప్రస్తుతం శివానీ సూసైడ్ కలకలం రేపుతోంది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో టెన్త్ చదువుతోంది ముర్రం శివాని. ఈ నెల 24న పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టేజ్పై సీఎం చంద్రబాబు ముందు ఎంతో ధైర్యంగా మాట్లాడింది. శివాని మాటలకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చప్పట్లు కొట్టి మరీ ప్రశంసించారు. అంత ధైర్యంగా మాట్లాడిన శివాని ఇక బతకలేకపోతున్నానని నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also read: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊహించని చిక్కులు.. ఆ ఇద్దరి మంత్రుల వల్ల పనులన్నీ బంద్!
శివానీ మృతిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. గతంలో ఆమేతో మాట్లాడిన సంధర్బాన్ని గుర్తు చేసుకుని బాదపడ్డారు. ఇంతకీ శివానీ మృతికి గల కారణాలేంటి? ఇందులో దాగిన రహస్యమేంటి? అంతగా స్టేజ్ ఎక్కి తన స్పీచ్తో దడదడలాడించిన ఒక అమ్మాయి ఇంత బేలగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? అన్న డౌట్ అందరికీ వస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్గా జ్యోతిర్మయి నాయక్!