E-Paper
Advertisement

CM Chandrababu: ఆ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: సీఎం చంద్రబాబు

Four People died in One Family: ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మట్టె మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు చంద్రబాబు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుటుంబంపై అర్ధరాత్రి మట్టిమిద్దె కూలడంతో తల్లపురెడ్డి గురుశేఖర్ తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో పదవ తరగతి చదువుతున్నది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబట్టువులు మృతిచెందడంతో ప్రసన్న అనాథ అయ్యింది.

Also Read: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

ఈ ఘటనపై పూర్తి సమాచారం తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రసన్నకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ సమక్షంలో ఉంటుందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రసన్న పేరుతో రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని, అదేవిధంగా వృద్ధురాలైన నాగమ్మకు రూ. 2 లక్షల సాయం అందించాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ఆమెకు ధైర్యం చెప్పాలని సూచించారు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా ఉంటాన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటూ చంద్రబాబు తెలిపారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×