BigTV English

Chandrababu Tirupati Visit: నేడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Tirupati Visit: నేడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Tirupati Visit: ఇవాళ (శనివారం) తిరుపతిలో పర్యటించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10 గంటలకు తిరుపతికి ఆయన బయలుదేరుతారు. 11 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు రీచ్ అవుతారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకనున్నారు.


తూకివారంలోని వ్యర్థ నిర్వహణ కేంద్ర సందర్శన
విమానాశ్రయం చేరుకున్న వెంటనే, ఉదయం 11:30కి తిరుపతి మున్సిపాలిటీలోని.. తూకివారంలో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను సీఎం పరిశీలించనున్నారు. ఈ కేంద్రం ద్వారా నగర వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేసి పునర్వినియోగానికి పంపే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం చేసే కృషిని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఇది తిరుపతిని ‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దే దిశగా తీసుకున్న కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు అధికారులు.

కపిల తీర్థంలో భక్తి సందర్శనం
అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎం కపిల తీర్థం ఆలయానికి చేరుకుని, శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమల పర్వత పాదభాగంలో ఉన్న ఈ ప్రసిద్ధ శైవక్షేత్రంలో.. ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో.. దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.


ప్రజావేదికలో ప్రజలనుద్దేశించి ప్రసంగం
మధ్యాహ్నం 1:15 గంటలకు తిరుపతిలోని.. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ ప్రజావేదికలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలో ఆయన రాష్ట్రానికి కొత్తగా తీసుకురానున్న అభివృద్ధి మార్గాల గురించి, తిరుపతి అభివృద్ధిపై ప్రాధాన్యత గురించి, తిరుమల ప్రాంతానికి ప్రత్యేకంగా తీసుకునే చర్యలపై పలు అంశాలను ప్రజలకు వివరించనున్నారని సమాచారం.

కంచి పీఠానికి పర్యటన – ఆధ్యాత్మిక ప్రాధాన్యం
సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు.. అలిపిరి చేరుకుని అక్కడి నుంచి కంచి కామకోటి పీఠానికి పర్యటిస్తారు. ఈ పీఠానికి వెళ్లడం ఆయనకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చర్యగా భావిస్తున్నారు. అక్కడ పీఠాధిపతులను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

తిరుగు ప్రయాణం
ఇవన్నీ ముగించుకుని సాయంత్రం 5 గంటలకు తిరిగి.. రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకుని విజయవాడకు బయలుదేరుతారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు సంబంధించి.. జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పర్యటనలో పాల్గొనే ప్రతి ఘట్టాన్ని పర్యవేక్షించేందుకు.. అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.

ప్రజల్లో నూతన ఆశలు
చంద్రబాబు తిరుపతి పర్యటనపై ప్రజల్లో మంచి ఆశాభావం నెలకొంది. తిరుపతి అభివృద్ధిపై చంద్రబాబు గతంలో తీసుకున్న చర్యలు, ప్రత్యేక పథకాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాయి. నూతన పాలనలో తిరుపతికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు.

Also Read: ఆ పని పూర్తయితే పిఠాపురం వాసులు పవన్ కి గుండెల్లో గుడికడతారు

ఈ పర్యటనలో తీసుకునే నిర్ణయాలు, ప్రకటించబోయే ప్రణాళికలు.. తిరుపతి పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని.. ప్రజలు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

 

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×