E-Paper
Advertisement

CM Jagan Comments on CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్

CM Jagan Comments on CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్
Advertisement

CM Jagan Comments on Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం హిందూపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎండను లెక్క చేయకుండా తనపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడికి వచ్చిన జనాన్ని ఉద్దేశిస్తూ ఆయన అన్నారు.

“మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చాం. ఈ ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అవ్వతాతలకు గతంలో ఎన్నడూ రానివిధంగా ఇంటికే రూ. 3 వేల పెన్షన్ వస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల చేతిలో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. మత్స్యకార భరోసా, వాహన మిత్రా, లా నేస్తం, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షను అమలు చేస్తున్నాం. 58 నెలల్లోనే ఈ విప్లవాత్మక మార్పులు జరిగాయి. మేనిఫెస్టోను భగవత్ గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం” అని జగన్ అన్నారు.

Advertisement

Also Read: జగన్ ఇంటికి వాస్తు దోషం? ఐదేళ్లలో కనిపించలేదా?

’14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా..? మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు’ అని జగన్ అన్నారు. రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

Advertisement

2014లో హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా..? ఏపీని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చంద్రబాబు చేసిండా..? అంటూ ప్రశ్నించాడు. గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చని వారిని మళ్లీ నమ్మొచ్చా అంటూ ఆయన అన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×