Big Stories

CM Jagan Comments on CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్

CM Jagan Comments on Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం హిందూపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎండను లెక్క చేయకుండా తనపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడికి వచ్చిన జనాన్ని ఉద్దేశిస్తూ ఆయన అన్నారు.

- Advertisement -

“మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చాం. ఈ ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అవ్వతాతలకు గతంలో ఎన్నడూ రానివిధంగా ఇంటికే రూ. 3 వేల పెన్షన్ వస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల చేతిలో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. మత్స్యకార భరోసా, వాహన మిత్రా, లా నేస్తం, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షను అమలు చేస్తున్నాం. 58 నెలల్లోనే ఈ విప్లవాత్మక మార్పులు జరిగాయి. మేనిఫెస్టోను భగవత్ గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం” అని జగన్ అన్నారు.

- Advertisement -

Also Read: జగన్ ఇంటికి వాస్తు దోషం? ఐదేళ్లలో కనిపించలేదా?

’14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా..? మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు’ అని జగన్ అన్నారు. రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

2014లో హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా..? ఏపీని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చంద్రబాబు చేసిండా..? అంటూ ప్రశ్నించాడు. గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చని వారిని మళ్లీ నమ్మొచ్చా అంటూ ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News