Vidadala Rajini news today : మంత్రి రజినీ చుట్టూ రచ్చ.. మామ, ఓఎస్డీ దౌర్జన్యాలు..

AP Updates: మంత్రి రజినీ చుట్టూ రచ్చ.. మామ, ఓఎస్డీ దౌర్జన్యాలు..

minister rajini
Share this post with your friends

Vidadala Rajini news today

Vidadala Rajini news today(Political news in AP):

ఏపీ మంత్రి విడుదల రజిని మామ విడుదల లక్ష్మీనారాయణ.. ఓ కాంట్రాక్టర్‌పై దౌర్జన్యానికి దిగారు. కాంట్రాకర్‌ను చంపేస్తానంటూ గొంతు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి మధ్య చిలకలూరిపేటలోని పురుషోత్తంపట్నంలో నిర్మిస్తున్న టీటీడీ దేవాలయం నిర్మాణంలో వివాదం వచ్చినట్లుగా తెలుస్తోంది.

టీటీడీ AE, DEల క్వాలిటీ అప్రూవల్‌తోనే నిర్మాణం చేసానంటున్నాడు కాంట్రాక్టర్. ఐతే క్వాలిటీ బాగోలేదు డబ్బులు రిటన్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. కానీ లక్ష్మీనారాయణ తీరుతో వివాదం నెలకొందని కాంట్రాక్టర్ చెబుతున్నారు. మరోవైపు చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేశారు లక్ష్మీనారాయణ. అటు పోలీసులు సైతం మంత్రిగారి మామ కావడంతో సెటిల్ చేసుకోవాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు సమాచారం.

మరో ఘటనలో.. మంత్రి రజినీ ఓఎస్డీ, ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ మధుసూదనరెడ్డి.. 108 కాల్‌సెంటర్‌ ఉద్యోగిని కొట్టడం కలకలం రేపింది. తమపై దాడికి నిరసనగా.. ఉద్యోగులు పావుగంట పాటు కాల్స్ తీసుకోకుండా నిరసన తెలిపారు.

అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్సు రాకలో జాప్యంతో రైలు ప్రమాద బాధితుడు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సీఎం కార్యాలయం వివరణ కోరింది. వెంటనే అదనపు సీఈవో మధుసూదనరెడ్డి మంగళగిరిలోని 108 కాల్‌సెంటర్ ఆఫీసుకు వెళ్లారు. జరిగిన ఘటనపై డ్యూటీలో ఉన్న ఉద్యోగిని తిడుతూ.. చేయి చేసుకున్నారు.

ఉన్నతాధికారి కొట్టడంపై 108 కాల్ సెంటర్ ఉద్యోగులు విధులు నిలిపేసి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. అధికారులు సిబ్బందికి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సంఘటనపై మధుసూదనరెడ్డికి మెమో ఇవ్వాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Modi : మోదీ వరంగల్ టూర్.. 144 సెక్షన్.. నో ఫ్లై జోన్.. భారీ భద్రత..

Bigtv Digital

Israel Gaza Attacks : నెతన్యాహు ప్రధాని కావడంతో.. మళ్లీ మొదలైన మిసైల్ దాడులు..

BigTv Desk

Jigarthanda 2 :లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కాంబోలో‘జిగర్ తండ 2’ షురూ

BigTv Desk

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Bigtv Digital

Mamata Benerjee : ఇలాగే కొనసాగితే దేశంలో అధ్యక్ష పాలన తప్పదు : మమత

BigTv Desk

MODI: అలాంటి రాజకీయాలు వద్దు.. ఆ పార్టీలపై మోదీ ఫైర్..

BigTv Desk

Leave a Comment