E-Paper
Advertisement

Case Filed on Director RGV: పోలీసుల విచారణకు ఆర్జీవీ డుమ్మా.. ఫోన్ ద్వారా సమాచారం

Case Filed on Director RGV: పోలీసుల విచారణకు ఆర్జీవీ డుమ్మా.. ఫోన్ ద్వారా సమాచారం
Advertisement

Case Filed on Director RGV: అందరూ భావించినట్టుగా ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు తాను వస్తానని, కాకపోతే నాలుగు రోజులు గడువు కావాలని అధికారులను కోరారు. ఈ లెక్కన శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రకాశం పోలీసులకు తాను నాలుగు రోజుల తర్వాత వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ. షూటింగ్ నిమిత్తం తాను బిజీగా ఉన్నారని అందులో పేర్కొన్నారట.  దానికి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలీదు. కాకపోతే మంగళవారం విచారణకు మాత్రం హాజరుకాలేదు.

Advertisement

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు ఆర్జీవీ. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నోటీసులను స్వయంగా తీసుకెళ్లి వర్మకు అందజేసిన విషయం తెల్సిందే.

వర్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. వర్మ విచారణకు రాకపోవడంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే దానిపై ఆసక్తికరంగా మారింది. 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు పోలీసులు. రాకపోతే వర్మను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Advertisement

ALSO READ:  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

విచారణ విషయంలో రామ్ గోపాల్‌వర్మ వెనుకడుగు వేశారన్నది కొందరి మాట. ఒక్కసారి విచారణకు వెళ్తే ఇరుక్కుంటామని, వెళ్లకుండా తప్పించుకోవడమే బెటరని తెలుస్తోంది. దీనిపై గత రాత్రి వైసీపీకి చెందిన కొందరు న్యాయవాదులతో మంతనాలు జరిపారట. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని, గడువు కోరాలని సలహా ఇచ్చారట.

మరోవైపు షూటింగ్‌ నిమిత్తం విచారణకు హాజరుకాలేకపోయానని చెబుతూ పిటిషన్ వేసేందుకు ఆర్జీవీ సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×