E-Paper
Advertisement

Election Commission: బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం..!

Election Commission: బన్నీ టూర్ ఎఫెక్ట్.. నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం..!
Advertisement

Election Commission Action on Nandyala SP: శనివారం సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశాడు. బన్నీ నంద్యాలకు చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్రారెడ్డి ఇంటికి బన్నీ భారీ ర్యాలీతో బయలుదేరాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా నంద్యాలలో అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. ఆ జిల్ల పోలీస్ బాస్‌పై పడింది.

బన్నీ టూర్‌లో భారీ ఎత్తున జనం గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీ తీయడంతో బన్నీపై కేసు నమోదయ్యింది. ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు అందడంతో ఏపీ పోలీసుల తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమలలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. దీంతో అతనిపై శాఖాపరమైన విచారణ జరపాలని ఈసీ ఏపీ డీజీపీకి సూచించింది.

Advertisement

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీని ఆదేశించింది. ఇక నంద్యాల టూటౌన్ సీఐ రాజారెడ్డిపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శాఖాపరమైన విచారణ జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కేసు క్లోజ్ చేయొద్దని హెచ్చరించింది.

Also Read: కోడ్ ఉల్లంఘన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు..!

Advertisement

అటు తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐలు జగన్‌మోహన్ రెడ్డి, అంజూ యాదవ్, అమర్ నాథ్ రెడ్డికి అనంతపురం విధులు, సీఐలు శ్రీనివాసులు, వినోద్ కుమార్‌కు అనంతపురంలో ఎన్నికల విధుల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×