E-Paper
Advertisement

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..
Advertisement

New Bar Policy: ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు శుభవార్త అందించింది ప్రభుత్వం. నూతన బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు భారీగా తగ్గనుంది. లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా కల్పించనుందని తెలిపారు.

పాలసీతో బార్ లైసెన్సీలకు లాభదాయకం..
ఈ పాలసీ బార్ లైసెన్స్‌లకు లాభదాయకంగా మారనుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం..
కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని 55 లక్షలకు తగ్గించారు. అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు 1.79 కోట్ల నుంచి 55 లక్షలకు తగ్గించారు. తిరుపతిలో1.72 కోట్ల నుంచి 55 లక్షలకు, ఒంగోలులో 1.4 కోట్ల నుంచి 55 లక్షలకు తగ్గించినట్లు వెల్లడి ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు. లైసెన్స్‌ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంది. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును 5 లక్షలకు తగ్గించారు.

Also Read: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Advertisement

దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలకు తగ్గింపు
రాష్ట్రమంతటా ఒకే తరహాలో దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలుగా నిర్ధారించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి బార్ లైసెన్సులను బహిరంగ లాటరీ ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. కొత్త దరఖాస్తుదారులను నూతన బార్ పాలసీ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×