E-Paper
Advertisement

Bone Stuck in Man Throat: గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క.. ఎలా తీశారంటే..

Bone Stuck in Man Throat: గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క.. ఎలా తీశారంటే..
Advertisement

Bone Stuck in Man Throat: చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా నాన్ వెజ్ వంటకాల పేర్లు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక మాంసం వంటకాలు రెడీ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లొట్టలేసుకుని తింటుంటారు. ఆయితే మాంసం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు నిరూపించాయి. తాజాగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి కొద్దిరోజులపాటు నరకయాతన అనుభవించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి గొంతులో ఉన్న ఎముకను వైద్యులు ఎండోస్కోప్క్ ద్వారా బయటకు తీశారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అన్నం తినేటప్పుడు మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తికి గుంటూరు GGHలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. షేక్ ఆదాం షఫీ అనే వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్‌లో మాంసాహారం తీసుకున్నారు. ఆ సమయంలో అతని గొంతులో మాంసపు ఎముక ఇరుక్కుపోయింది.

Advertisement

Also Read: టీడీపీ నేత సపోర్టుతో కొలంబియాలో కేసినో.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా..!

గత 3 రోజులుగా ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే ముక్కులో నుంచి ఆ బోన్ బయటికి వస్తుందని షఫీ కుటుంబ సభ్యులు భావించారు. అయితే షఫీ ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరు GGHకి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయగా తొలుత గొంతులోని ఎముకకు సంబంధించి వైద్యులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. చివరికి ఎండోస్కోపీ పరికరం ద్వారా ఆ ఎముక భాగాన్ని బయటకు తీయటంతో ప్రాణాపాయ నుంచి బయటపడ్డ షఫీ ప్రస్తుతం కోలుకుంటున్నారు.

Advertisement

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×