Rain Alert: ఎల్ నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై స్పష్టంగా పడింది. వానలు లేక సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. వాన కబురు తెలియగానే ఊపిరిపీల్చుకుంటున్నారు రైతులు.
వానలు లేక అల్లాడిపోతున్నారు సగటు సామాన్యులు. పగలు-రాత్రివేళ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సామాన్యులు. దీనికితోడు ఎల్ నినో కూడా తోడుకావడంతో వాతావరణ కాసింత చల్లగా ఉంటుందికానీ, వర్షాలు మాత్రం పడడం లేదు. ఇక రైతుల గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
శుక్రవారం పలు జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే తూర్పు-పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి చెబుతోంది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశముందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. జూన్లో నైరుతి పవనాలు ప్రవేశించాయి, ఆ సమయంలో తేలికపాటి వర్షాలు కురిసాయి. ఆ తర్వాత భారీ వర్షాలు పడిన సందర్భం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడినా వాతావరణ చల్లగా మాత్రమే ఉంటుంది.
ALSO READ: మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనసేన ఎంపీ కొడుకు కారు ఢీకొని యువతి మృతి!
రాష్ట్రంలో సరైన వర్షాలు పడక రైతుల్లో ఆందోళన మొదలైంది. చాలావరకు పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పాలేరు-20 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ- 16.8, గుంటూరు జిల్లా తెనాలి-16.4, కర్నూలు జిల్లా దేవనకొండ-13.8, అన్నమయ్య జిల్లా రాజంపేట-10.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు-10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు తెలిపింది.