BigTV English
Advertisement

YS Jagan: నాగ స్టోరీ మొత్తం చెప్పేసిన జగన్.. అంతా ఆయనే చేశారు..

YS Jagan: నాగ స్టోరీ మొత్తం చెప్పేసిన జగన్.. అంతా ఆయనే చేశారు..

YS Jagan: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి గెలిపించుకోవడానికి అన్యాయాలు చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ఆరోపణలతో ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను అవమానించి మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆయనను తీవ్రంగా ఇబ్బందికి గురిచేశారు. లేకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు బెదిరించారు’ అని జగన్ చెప్పారు.

READ ALSO: Kavitha : బావతోనూ గొడవ? కవిత టైంపాస్ కహానీ..


జూన్ 5న రాత్రి సమయంలో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. ఆ తర్వాత గుంటూరులోని తన తమ్ముడి ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తండ్రికి కాల్ చేసి పోలీసులు బెదిరిస్తున్నారని.. చెప్పారు. పోలీసుల తీరుతోనే.. నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. తన కొడుకును కాపాడుకోవడానికి వెంకటేశ్వర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని జగన్ ఫైరయ్యారు.

READ ALSO: Jagan convoy: దారుణం.. జగన్ పర్యటనలో మరొక వ్యక్తి మృతి

నాగమల్లేశ్వరరావును బెదిరించిన పోలీసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి..? ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. వాళ్లకు ఇప్పుడు సమాధానం చెబుతారు? ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా బాధలోనే ఉంది. ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×