E-Paper
Advertisement

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..
Advertisement
Elephant attack in chittoor

Elephant attack in chittoor(Breaking news in Andhra Pradesh):

అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఒంటరి ఏనుగు చిత్తూరులో బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ముగ్గురిని బలి తీసుకుంది. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అతికష్టం మీద ఆపరేషన్ గజ చేపట్టి.. ఆ మదపుటేనుగును బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతం. బుధవారం అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఇంతలో అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఒంటరి ఏనుగు.. ఒక్కసారిగా పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దాడి చేసింది. దంపతులను చంపేసి.. తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.

Advertisement

గురువారం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి మరో మహిళను చంపేసింది ఆ ఏనుగు. మొదటిరోజే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే మరో నిండు ప్రాంణం పోయిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.

అటు, మదపుటేనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ చేపట్టింది అటవీశాఖ. ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. రామాపురం దగ్గర చెరుకు తోటలో కనిపించిన ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు. అనంతరం, తిరుపతి జూ పార్కు తరలించారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×