BigTV English
Advertisement

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..
Elephant attack in chittoor

Elephant attack in chittoor(Breaking news in Andhra Pradesh):

అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఒంటరి ఏనుగు చిత్తూరులో బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ముగ్గురిని బలి తీసుకుంది. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అతికష్టం మీద ఆపరేషన్ గజ చేపట్టి.. ఆ మదపుటేనుగును బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…


చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతం. బుధవారం అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఇంతలో అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఒంటరి ఏనుగు.. ఒక్కసారిగా పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దాడి చేసింది. దంపతులను చంపేసి.. తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.

గురువారం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి మరో మహిళను చంపేసింది ఆ ఏనుగు. మొదటిరోజే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే మరో నిండు ప్రాంణం పోయిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.


అటు, మదపుటేనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ చేపట్టింది అటవీశాఖ. ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. రామాపురం దగ్గర చెరుకు తోటలో కనిపించిన ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు. అనంతరం, తిరుపతి జూ పార్కు తరలించారు.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×