BigTV English

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..

Chittoor Elephant attack: ముగ్గురిని చంపిన ఏనుగు.. ఆపరేషన్ గజ గజ..
Elephant attack in chittoor

Elephant attack in chittoor(Breaking news in Andhra Pradesh):

అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఒంటరి ఏనుగు చిత్తూరులో బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ముగ్గురిని బలి తీసుకుంది. అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అతికష్టం మీద ఆపరేషన్ గజ చేపట్టి.. ఆ మదపుటేనుగును బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…


చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతం. బుధవారం అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఇంతలో అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఒంటరి ఏనుగు.. ఒక్కసారిగా పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దాడి చేసింది. దంపతులను చంపేసి.. తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.

గురువారం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి మరో మహిళను చంపేసింది ఆ ఏనుగు. మొదటిరోజే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే మరో నిండు ప్రాంణం పోయిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.


అటు, మదపుటేనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ చేపట్టింది అటవీశాఖ. ననియాల ప్రాజెక్టు నుంచి తెచ్చిన రెండు కుంకీ ఏనుగుల సాయంతో ఆ ఏనుగును అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. రామాపురం దగ్గర చెరుకు తోటలో కనిపించిన ఏనుగుపై తుపాకీతో మత్తుమందు ప్రయోగించారు. మత్తులో ఉన్న ఏనుగును రెండు కుంకీ ఏనుగుల సహాయం తో అదుపులోకి తెచ్చారు. అనంతరం, తిరుపతి జూ పార్కు తరలించారు.

Related News

Nara Lokesh: నలుగురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఏపీకి ఏయే వరాలు అడిగారంటే?

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Tadipatri politics: తాడిపత్రిలో హైటెన్షన్.. ఏడాది తర్వాత పెద్దారెడ్డి ఎంట్రీ, భారీగా పోలీసుల మోహరింపు

Big Stories

×