E-Paper
Advertisement

Vangalapudi Anitha On Jagan: మంత్రి అనిత మాస్ పంచ్.. రూ.11కు పందాలు కడుతున్నారు!

Vangalapudi Anitha On Jagan: మంత్రి అనిత మాస్ పంచ్.. రూ.11కు పందాలు కడుతున్నారు!
Advertisement

Vangalapudi Anitha On Jagan: ఎక్కడైనా స్కూల్స్, కాలేజీల వద్ద ర్యాగింగ్ లు చేయడం చూస్తూ ఉంటాం. పోలీసుల పుణ్యమా అంటూ ప్రస్తుతం ఆ ర్యాగింగ్ కూడా మాయమవుతోంది. కానీ అసెంబ్లీ వద్ద ర్యాగింగ్ తరహా కామెంట్స్ తో వైసీపీ కి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు. అందులో తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ చూస్తే.. ఈ ర్యాగింగ్ మామూలు ర్యాగింగ్ కాదురా అయ్య అంటున్నారు టీడీపీ మాస్ నేతలు.

అసెంబ్లీ సమావేశాలకు మేము రాము. మాకు మైక్ ఇవ్వరు. ఇచ్చే ఉద్దేశం మీకు లేదు. మేము అందుకే రాము అంటూ.. ఇటీవల మాజీ సీఎం జగన్ కామెంట్ చేశారు. అలాగే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోర్టు మెట్లు కూడా ఇక్కారు జగన్. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

Advertisement

ఇప్పటికే స్పీకర్ గా జగన్ బద్దశత్రువు లా గుర్తించబడ్డ అయ్యన్న పాత్రుడు ఆశీనులు కాగా, జగన్ డిప్యూటీ స్పీకర్ పదవితో జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది టీడీపీ. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇంకేముంది జగన్ అసెంబ్లీకి వచ్చినా.. ఈ ఇద్దరి ముందు ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాల్సిన పరిస్థితి.

ఇలాంటి పరిస్థితిపై తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత కీలక కామెంట్స్ చేశారు. జగన్ తన డ్రామాలు ఆపాలని, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా జగన్ సరిపోరనే ఏపీ ప్రజలు 18 సీట్లకు బదులు 11 సీట్లు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా జగన్ పారిపోతున్నారని, ప్రజాస్వామ్యంపై జగన్కు ఏమాత్రం గౌరవం లేకపోవడమే ఇందుకు కారణంగా అనిత అభివర్ణించారు.

Advertisement

Also Read: AP Assembly Session: అసెంబ్లీలో RRR సినిమా హవా.. నాటు నాటు పాట పాడిన చంద్రబాబు.. అసలు కారణం ఇదే!

రాష్ట్రంలో విభిన్న రీతిలో జగన్ అసెంబ్లీకి హాజరు కావడంపై, పందేలు కాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది కూడా కేవలం రూ.11లు పందెంగా నిర్ధారించి, ప్రజలు ఈ తరహా ర్యాగింగ్ చేస్తున్నారని తమకు తెలిసిందన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో జగన్ సిద్దహస్తుడిగా చెప్పిన హోం మంత్రి, తన సొంత బాబాయి వివేకా హత్య దగ్గర నుండి, సోషల్ మీడియాలో బూతుల వరకు జగన్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ను ప్రజలు గమనించారని అందుకే 11 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కినట్లు హోంమంత్రి అన్నారు.

ఇలా హోమ్ మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ అసెంబ్లీకి రావడంపై కేవలం రూ. 11 లు పందెం కాస్తున్నారని చెప్పడం వెనుక, వైసీపీకి దక్కిన 11 సీట్లే కారణమని చర్చ సాగుతోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×