E-Paper
Advertisement

Minister Ravi Kumar: ఈ పాపం జగన్‌దే.. వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్

Minister Ravi Kumar:  ఈ పాపం జగన్‌దే..  వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్
Advertisement

Minister Ravi Kumar: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమైంది వైసీపీ. డిసెంబర్ 27న ఏపీ అంతటా నిరసన తెలపనుంది. నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచారని, మళ్లీ వారే ధర్నాకు పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆ తరహా వింత పోకడ ఎక్కడా చూడలేదన్నారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని, జగన్ ఇంటి ముందు చేస్తే బాగుండేదన్నారు.

Advertisement

జగన్  ఆందోళనకు పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందన్నారు గొట్టిపాటి రవికుమార్. ట్రూఆప్ ఛార్జీలు పెంపు ముమ్మాటికీ జగన్ పాపమేనన్నారు. పదవి నుంచి దిగే పోయే ముందు ప్రజలపై విద్యుత్ భారం మోపారన్నారు. రేట్ల పెంపుపై ఈఆర్‌సీకి ఎవరు సిఫార్సు చేశారని ప్రశ్నించారు.

ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. 2019లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్‌కు అప్పగిస్తే, 2024 నాటికి సర్వనాశనం చేశారన్నారు. కావాల్సినవారికి దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారన్నారు.

Advertisement

ALSO READ:  పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×