E-Paper
Advertisement

Minister Ravi Kumar: ఈ పాపం జగన్‌దే.. వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్

Minister Ravi Kumar:  ఈ పాపం జగన్‌దే..  వైసీపీ పోరుబాటపై మంత్రి గొట్టిపాటి కౌంటర్

Minister Ravi Kumar: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమైంది వైసీపీ. డిసెంబర్ 27న ఏపీ అంతటా నిరసన తెలపనుంది. నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచారని, మళ్లీ వారే ధర్నాకు పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆ తరహా వింత పోకడ ఎక్కడా చూడలేదన్నారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని, జగన్ ఇంటి ముందు చేస్తే బాగుండేదన్నారు.

జగన్  ఆందోళనకు పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందన్నారు గొట్టిపాటి రవికుమార్. ట్రూఆప్ ఛార్జీలు పెంపు ముమ్మాటికీ జగన్ పాపమేనన్నారు. పదవి నుంచి దిగే పోయే ముందు ప్రజలపై విద్యుత్ భారం మోపారన్నారు. రేట్ల పెంపుపై ఈఆర్‌సీకి ఎవరు సిఫార్సు చేశారని ప్రశ్నించారు.

ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. 2019లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్‌కు అప్పగిస్తే, 2024 నాటికి సర్వనాశనం చేశారన్నారు. కావాల్సినవారికి దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారన్నారు.

ALSO READ:  పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×