E-Paper
Advertisement

Ramprasad Reddy On Roja: మాజీ మంత్రి రోజా కు బిగ్ షాక్.. సంచలన ప్రకటన చేసిన మంత్రి

Ramprasad Reddy On Roja: మాజీ మంత్రి రోజా కు బిగ్ షాక్.. సంచలన ప్రకటన చేసిన మంత్రి
Advertisement

Ramprasad Reddy On Roja: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాకిచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా రోజా కొనసాగారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశం మీదనే ప్రస్తుతం రోజాకు షాకిచ్చేందుకు కూటమి సిద్దమైందని చెప్పవచ్చు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు నాడు జగన్ అన్నారు. ఈ సంధర్భంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు పలు క్రీడలకు సంబంధించి కిట్లను కూడా అందజేశారు. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇంటింటికీ వెళ్లి పలు వివరాల నమోదు కార్యక్రమం సైతం సాగింది. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఆ సమయంలో కేవలం క్రీడాకారుల గుర్తింపు కోసం సర్వే సాగిందని ప్రకటనలు ఇచ్చింది.

Advertisement

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నేతలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడినట్లు పలు మార్లు ఆరోపించారు. ప్రధానంగా నాటి మంత్రి హోదాలో గల రోజాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. రోజా కూడా స్పందిస్తూ.. కేవలం గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి రాంప్రసాద్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం రూ. 119 కోట్లు ఖర్చు చేసిందని, అందులో తప్పక అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడిందని ఆరోపించినట్లు భావించవచ్చు. అలాగే ఆ సమయంలో మాజీ మంత్రి రోజా ఈ కార్యక్రమం భాద్యతలను పర్యవేక్షించారు.

Advertisement

Also Read: Jagan on Pawan Kalyan: పవన్ పై జగన్ గురి.. కార్పొరేటర్ కు ఎక్కువ అంటూ ఘాటు విమర్శ..

ప్రస్తుతం నివేదిక తయారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కాగా, ఈ అంశంపై రోజా ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఆవినీతి జరిగిందా లేదా అన్నది అసెంబ్లీకి సమర్పించే నివేదికను బట్టి చెప్పవచ్చు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లలో గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అందుకే టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన తర్వాత, టూరిజం శాఖ ద్వారా అందించే టికెట్లను రద్దు చేశారు. ఇటీవల మరలా ఆ టికెట్లను టీటీడీ పునరుద్దరించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×