E-Paper
Advertisement

MLC Botsa: కరకట్టకు గండిపడితే కుట్ర కోణమైతదా..? అసలు ఏం మాట్లాడుతున్నావ్ సీఎం గారూ..??

MLC Botsa: కరకట్టకు గండిపడితే కుట్ర కోణమైతదా..? అసలు ఏం మాట్లాడుతున్నావ్ సీఎం గారూ..??
Advertisement

MLC Botsa Satyanarayana Serious on CM Chandrababu: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? వరద బాధితులకు కనీసం భోజనం అందిచడంలేదు. బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా?. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది..?

వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టిందో చెప్పాలి. వరదలు వస్తున్నప్పుడు డు మానిటరింగ్ ఎందుకు చేయలేదు? గతంలోనూ ప్రకాశం బ్యారేజ్ కు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు మేం దగ్గరుండి మానిటరింగ్ చేశాం.

Advertisement

Also Read: విహార యాత్రల కోసం సీఎం, మంత్రులు ప్లాన్ చేసుకుంటూ.. వరద బాధితులను పట్టించుకోవట్లేదు: రోజా

చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురదజల్లుతున్నారు. కరకట్టకు గండిపడితే కుట్ర కోణం అంటున్నారు. గతంలో కరకట్ట కొట్టుకుపోయి చంద్రబాబు ఇళ్లు మునిగిపోలేదా..? కృష్ణలంక దగ్గర గోడ కట్టాం కాబట్టే నష్టం తగ్గింది.

Advertisement

విజయవాడలో ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారో చెప్పాలి. ఎంతమందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారో వివరాలు వెల్లడించాలి. చంద్రబాబు బస్సులో పడుకుంటే ఎవరికి లాభం?’ అంటూ బొత్స పేర్కొన్నారు.

Also Read: కాదంబరీ జెత్వానీ కేసు.. వైఎస్ జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు

అధికార యంత్రాంగం అసలేం చేస్తోంది? మీరు, మీ సలహాదారులు ఏం చేస్తున్నారు..? బ్యారేజీని బోట్లు ఢీ కొంటే కుట్ర కోణం అంటున్నారు. అలా మాట్లాడడం సరికాదు. బాధ్యతమైన హోదాలో ఉన్న చంద్రబాబు అలా మాట్లాడొచ్చా..? బాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురద జల్లుతున్నారు.

వరదలో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అమరావతి గ్రామాల్లో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి. కరకట్టకు వరద వచ్చిందా? రాలేదా? నాకు అనుమతి ఇవ్వండి.. ఇద్దరం కలిసి చూసొద్దాం. దాచేస్తే నిజాలు దాగవు’ అంటూ చంద్రబాబుపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చోం.. : వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గత మూడు రోజుల నుంచి వరదలకు విజయవాడ పూర్తిగా అతలాకుతలమైతున్నది. ప్రజలు సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి కనీసం నీళ్లు, పాలు కూడా అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు వారికి కనీస అవసరాలు అందలేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు పార్టీ తరఫున కోటి రూపాయల సాయం అందించాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. రేపు తెల్లవారుజాము నుంచే పార్టీ నుంచి సహాయక కార్యక్రమాలను ప్రారంభిస్తాం. లక్ష పాల ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేస్తాం. బాధితులకు ఏం సాయం అవసరమో తెలుసుకుని వాటిని అందజేసేందుకు కృషి చేస్తాం.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×