BigTV English

AP Politics: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి వసంత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

AP Politics: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి వసంత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

Mylavaram MLA Vasantha Krishna Prasad Joins TDPAP Politics: ఏపీలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కొద్దిసేపటికే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిలెక్కారు.


వసంత కృష్ణప్రసాద్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆయనకు పార్టీ అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు వేమిరెడ్డి చేరిక తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ నెల్లురు పార్లమెంటు ఇక మనదే అని తేల్చి చెప్పారు. ఆనం, కోటంరెడ్డిని జగన్ వేధించారని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అవుతోందని స్పష్టం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మైలవరంకు చెందిన ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, ఆరుగురు ఎంపీటీసీలు, పన్నెండు మంది సర్పంచ్‌లు, ఏడుగురు సొసైటీ ప్రెసిడెంట్లు, 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గత కొంత కాలంగా పార్టీపై వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు.


టీడీపీలో చేరిన తర్వాత వసంత కృష్ణప్రసాద్ ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తేనే ఆ పార్టీలో టికెట్ ఇస్తారని లేదంటే టికెట్ రాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను తిడితే మంత్రి పదవులు ఇస్తారని లేదంటే పట్టించుకోరని అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే వైసీపీని వీడాల్సి వచ్చిందని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

Read More: ముగ్గురు ఇన్‌ఛార్జి లతో వైసీపీ 9వ లిస్ట్ విడుదల.. మంగళగిరిలో మళ్లీ మార్పు

ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. వీరి చేరికతో నెల్లూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా మారే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో ఎంపీ స్థానానికి ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిని ప్రకటించింది. దీంతో నెల్లూరు ఎంపీ ఫైట్ విజయసాయిరెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పల్నాడులో వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలు షాక్ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు పసుపు కండువా కప్పుకోనున్నారు. నరసరావుపేట టీడీపీకి కంచుకోట. అయితే.. గత ఎన్నికల్లో జిల్లాలో 7 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కీలక నేతల చేరికతో జిల్లాలో టీడీపీ బలం పెరగనుంది.

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×