E-Paper

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!
Advertisement

AP Bhavan: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్‌ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళను ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మించనున్నారు.

కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్

Advertisement

ఢిల్లీలో ఏపీ భవన్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NBCCకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 105 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, NBCC మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు 2లక్షల 49వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త భవన సముదాయాన్ని నిర్మిస్తారు. ప్లానింగ్, వాస్తు, ఆర్కిటెక్చరల్ డిజైన్ల తయారీ, టెండరింగ్, కాంట్రాక్ట్ నిర్వహణతో పాటు నిర్మాణ పనులన్నింటినీ టర్న్‌కీ పద్ధతిలో NBCC స్వయంగా పర్యవేక్షించనుంది. భవనం నిర్మాణం పూర్తైన తర్వాత కనీసం ఐదేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతలను NBCCనే చూసుకోనుంది.

Also Read: విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?

Advertisement

ప్రతిష్టాత్మక యూనివర్సిటీ క్యాంపస్

ప్రభుత్వ రంగ నిర్మాణ దిగ్గజం ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ జైత్రయాత్ర మార్కెట్‌లోనూ కొనసాగుతోంది. కేవలం ప్రస్తుత 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే (Q1) ఈ సంస్థ ఏకంగా రూ.955.13 కోట్ల విలువైన కొత్త నిర్మాణ కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. ఇందులో ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ క్యాంపస్, మోడ్రన్ టౌన్‌షిప్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ మైలురాయి వివరాలను సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా సమర్పించింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా, అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నారు. రానున్న రోజుల్లో ఏపీకి సంబంధించిన కీలక పరిపాలన, దౌత్య వ్యవహారాలకు కొత్త ఏపీ భవన్ వేదిక కానుంది.

Related News

విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?

అమరావతి అసాధ్యం.. మావిగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.. సజ్జల రామకృష్ణారెడ్డి

రూ.16,350 కోట్ల పెట్టుబడి.. రెండేళ్లలో ఉత్పత్తి.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు గ్యారంటీ!

మబ్బు పట్టింది.. వాన పడింది! రెండు రాష్ట్రాల్లో వాతావరణం కూల్.. కానీ ఆ ఇబ్బందులు తప్పట్లేదుగా!

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు..!

డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్‌పై చంద్రబాబు మార్క్ స్పీచ్

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

Big Stories

×