E-Paper

విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?

విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?
Advertisement

Lockup Death: విజ‌య‌వాడ యువ‌కుడు సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసు రోజుకో యుటర్న్ తీసుకుంటుంది. స‌స్పెండెడ్ సీఐ నాగ‌రాజు కోర్టుకు రాసిన లేఖ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. లాస్ట్‌ మినెట్‌లో సిట్‌ అధికారులు నాగరాజును కస్టడీలోకి తీసుకోకుండా మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అసలు ఈ కేసు విచారణలో ఏం జరుగుతుంది. నాగరాజు లేఖలో ఏ అంశాల్ని ప్రస్తావించారు. కస్టడీని కాదని సిట్‌ ఎందుకు కోర్టుకు వెళ్లింది.?

లాకప్ డెత్ కేసు విచారణపై ఉత్కంఠ

Advertisement

విజయవాడ లాకప్‌ డెత్‌ కేసు విచారణపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇవాళ సీఐ నాగరాజును సిట్‌ కస్టడీలోకి తీసుకుంటారని అందరు భావించారు. రాజమండ్రి జైలు దగ్గరకు సిట్ అధికారులతో పాటు ఇరువర్గాల లాయర్లు కూడా వచ్చేశారు. అయినప్పటికీ సీఐ నాగరాజును కస్టడీ తీసుకోలేదు. చివరి నిమిషంలో నాగరాజు కస్టడీ విచారణ నిబంధనల్లో మార్పు కోరూతూ సిట్ కోర్టును ఆశ్రయించింది. లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. దీంతో ఈ పిటిషన్ విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Also Read: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలి: గోమారం రమణారెడ్డి

Advertisement

18 పేజీల లేఖ దుమారం

ఇదిలా ఉండగా.. సీఐ నాగరాజు కోర్టుకు రాసిన 18పేజీల లేఖ పెద్ద దుమారం రేపుతోంది. త‌న‌కే పాపం తెలియ‌ద‌ని, తాను నిర్దోషిన‌ని లేఖలో రాసుకొచ్చారు. తనను ఇరికించేందుకు సిట్ డ్రామాలాడుతోంద‌ని నాగరాజు తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం చర్చనీయాంశంగా మారింది. త‌న‌ను బెదిరించి నేరాన్ని అంగీక‌రించేలా సిట్ కుట్ర చేస్తోంద‌ంటూ నాగ‌రాజు లేఖలో ప్రస్తావించడం బిగ్‌ డిబెట్‌ పాయింట్‌గా మారింది. లాయర్ల స‌మ‌క్షంలోనే విచారణ జ‌రిగేలా చూడాల‌ని కోర్టును నాగ‌రాజు రిక్వెస్ట్ చేశారు. నాగరాజు సిట్‌పై ఆరోపణలు చేశారు. ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిట్‌పై నమ్మకం లేదంటున్నారు. మొత్తానికి ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటపడుతుంది. నాగ‌రాజు కోర్టుకు లేఖ రాయ‌డం వెనుక ఏదైనా వ్యూహం వుందా? ఇటు సిట్ విచారణ నిబంధనల్లో ఎందుకు మార్పుకోరుకుంటుంది.

Related News

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!

అమరావతి అసాధ్యం.. మావిగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.. సజ్జల రామకృష్ణారెడ్డి

రూ.16,350 కోట్ల పెట్టుబడి.. రెండేళ్లలో ఉత్పత్తి.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు గ్యారంటీ!

మబ్బు పట్టింది.. వాన పడింది! రెండు రాష్ట్రాల్లో వాతావరణం కూల్.. కానీ ఆ ఇబ్బందులు తప్పట్లేదుగా!

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు..!

డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్‌పై చంద్రబాబు మార్క్ స్పీచ్

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

Big Stories

×