BigTV English

Elephant in Chittoor: ఆపరేషన్ గజ.. ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..

Elephant in Chittoor: ఆపరేషన్ గజ..  ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..

Elephant incident in Chittoor(Andhra pradesh today news) :

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలం పనుల కోసం వెళ్లిన దంపతులు వెంకటేశ్ , సెల్విపై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.


సీకే పల్లికి చెందిన సుధాకర్‌ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లికి చెందిన యువకుడు కార్తీక్‌ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఏనుగును బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం నుంచి జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులను గుడిపాలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగును బంధించేందుకు యత్నిస్తున్నారు. ఇద్దరిని చంపిన ఏనుగును బంధిస్తామని DFO చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చంతా.. ప్రభుత్వమే భరిస్తుందని DFO వెల్లడించారు.


Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×