BigTV English
Advertisement

Elephant in Chittoor: ఆపరేషన్ గజ.. ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..

Elephant in Chittoor: ఆపరేషన్ గజ..  ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..

Elephant incident in Chittoor(Andhra pradesh today news) :

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలం పనుల కోసం వెళ్లిన దంపతులు వెంకటేశ్ , సెల్విపై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.


సీకే పల్లికి చెందిన సుధాకర్‌ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లికి చెందిన యువకుడు కార్తీక్‌ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఏనుగును బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం నుంచి జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులను గుడిపాలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగును బంధించేందుకు యత్నిస్తున్నారు. ఇద్దరిని చంపిన ఏనుగును బంధిస్తామని DFO చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చంతా.. ప్రభుత్వమే భరిస్తుందని DFO వెల్లడించారు.


Related News

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Ap Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త.. కేవలం 20 రోజులే, ఇంకెందుకు ఆలస్యం

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ambati Rambabu: రూటు మార్చిన అంబటి రాంబాబు .. ఈసారి తిరుమలలో ప్రశంసలు, షాక్‌లో వైసీపీ నేతలు

Karthika Vanabhojanam: ఐదేళ్ల విరామం తర్వాత.. తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Big Stories

×