E-Paper
Advertisement

Elephant in Chittoor: ఆపరేషన్ గజ.. ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..

Elephant in Chittoor: ఆపరేషన్ గజ..  ఆ ఏనుగును బంధించేందుకు ప్రయత్నాలు..
Advertisement

Elephant incident in Chittoor(Andhra pradesh today news) :

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలం పనుల కోసం వెళ్లిన దంపతులు వెంకటేశ్ , సెల్విపై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.

సీకే పల్లికి చెందిన సుధాకర్‌ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లికి చెందిన యువకుడు కార్తీక్‌ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

ఏనుగును బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం నుంచి జయంత్, వినాయక్ అనే రెండు కుంకీ ఏనుగులను గుడిపాలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగును బంధించేందుకు యత్నిస్తున్నారు. ఇద్దరిని చంపిన ఏనుగును బంధిస్తామని DFO చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చంతా.. ప్రభుత్వమే భరిస్తుందని DFO వెల్లడించారు.

Related News

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

Big Stories

Advertisement
×