Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్ పెట్టారు. సీమలో గ్రామాలు, అటవీ అభివృద్ధికి రూ.8,022 కోట్లతో పనులు ప్రారంభించారు. రూ.4,523 కోట్లతో 23 వేలకుపైగా రోడ్ల పనులు మరియు రాయలసీమలో 5,238 కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఫార్మ్ పాండ్లతో 50 వేలకుపైగా ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలన్నారు.
41,614 ఫార్మ్ పాండ్ల నిర్మాణం. రూ.166.46 కోట్ల వ్యయం రాయలసీమలో 15 వేల మినీ గోకులాల నిర్మాణం చేయాలన్నారు. మరో 3 వేల పనులు పురోగతిలో 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు ఉపాధి హామీ నిధులు సమకూర్చారు. 28 వేల మందికిపైగా రైతులకు ఉద్యాన సాగుతో లబ్ధిచేకూరుతుందని కుంకీ ఏనుగులతో మానవ-ఏనుగుల ఘర్షణలు 75 శాతం తగ్గాయని తెలిపారు.
Also rerad: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!
దీంతో పంట నష్టం 50 శాతం తగ్గిందన్న ప్రభుత్వం తెలిపింది. రాయలసీమలో రూ.26 కోట్లతో 13 నగర వనాల నిర్మాణం పూర్తిచేయాలని, సీమ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2,782 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార పనులు, పులివెందుల మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్కు రూ.280 కోట్లతో పనులు చేయాలన్నారు. డోన్ మెగా వాటర్ స్కీమ్తో 3.5 లక్షల మందికి తాగునీరు అందిచాలన్నారు.
చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్కు రూ.2,370 కోట్లు పెట్టి 25 లక్షల మందికి తాగునీరు అందించాలన్నారు. రాయలసీమ గ్రామాల్లో 50 వేలకుపైగా కంపోస్ట్ గుంతలు 28 వేలకుపైగా ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలన్నారు. రోడ్లు, తాగునీరు, సాగు, పారిశుధ్యంతో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం మియ్యాలన్నారు. రాయలసీమను ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని పవన్ కల్యాన్ తెలిపారు.
Also read: మత్స్యకారులకు బిగ్ షాక్.. సబ్సిడీ వాహనాలపై అదనపు సెస్ భారం!