BigTV English
Advertisement

Petrol Pump Abuse: ఉద్యోగిని అర్దనగ్నంగా సంకెళ్లతో స్తంభానికి కట్టేసి.. పెట్రోల్ పంప్ మేనేజర్ దాష్టీకం

Petrol Pump Abuse: ఉద్యోగిని అర్దనగ్నంగా సంకెళ్లతో స్తంభానికి కట్టేసి.. పెట్రోల్ పంప్ మేనేజర్ దాష్టీకం

Petrol Pump Abuse| ఒక పెట్రోల్ పంప్‌లో పనిచేసే ఉద్యోగి పట్ల ఆ పంప్ మేనేజర్ అమానుషంగా ప్రవర్తించాడు. అతడి బట్టలు విప్పదీసి, కాళ్లు చేతులు సంకెళ్లతో కట్టేసి మనుషులతో కొట్టించాడు. డబ్బులు తక్కువగా ఇచ్చాడని కారణం చూపుతూ తన చర్యలను సమర్థించుకున్నాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగింది. అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో పంప్ బాయ్‌గా పనిచేసే యువకుడిని నిర్వాహకులు దారుణంగా చితకబాదారు. నల్లచెరువు మండలానికి చెందిన బాబాఫకృద్దీన్ కొన్ని రోజుల క్రితం ఈ బంక్‌లో పని ప్రారంభించాడు. ఈ పెట్రోల్ బంక్‌ను వైసీపీ నాయకుడు బత్తల హరిప్రసాద్ కుటుంబం నిర్వహిస్తోంది.


శనివారం ఉదయం ఫకృద్దీన్ డ్యూటీ ముగించి నగదు అప్పగించాడు. అయితే, పెట్రోల్ విక్రయాల కలెక్షన్ లో రూ.24 వేలు తక్కువ ఉన్నాయని మేనేజర్ సత్యనారాయణ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు దొంగతనం చేసి ఉంటాడని ఆరోపిస్తూ కొట్టాడు. ఆ తరువాత ఇతర ఉద్యోగులు అమర్‌నాథ్, మాబు, హరికృష్ణ కూడా అతడిని కొట్టారు. ఫకృద్దీన్ బట్టలు విప్పేసి, స్తంభానికి చైన్లతో కట్టేశారు. చేతులు, కాళ్లను అసలు కదలడానికి వీల్లేకుండా కట్టేశారు. సుమారు 2-3 గంటలపాటు అతడిని బహిరంగంగా హింసించారు. ఈ విషయం తెలిసి ఫకృద్దీన్ బంధువులు అక్కడికి చేరుకొని నిలదీసినా నిర్వాహకులు వినలేదు. ఆ తరువాత బాధితుడిని ఓ గదిలో పడేశారు.

విషయం తెలిసిన సీఐ నిరంజన్‌రెడ్డి పెట్రోల్ బంక్‌కు వెళ్లి విచారణ చేశారు. ఫకృద్దీన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మేనేజర్, ఇతర ఉద్యోగులను కూడా స్టేషన్‌కు పిలిచారు. వారు తమ యజమాని ఆదేశాల మేరకే ఇలా చేశామని చెప్పారు.


నగదు విషయంలో దొంగతనం జరిగినట్లు తేలితే చట్ట రీత్యా నిందితుడిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా అమానుషంగా కాళ్లు, చేతులు కట్టేసి కొట్టడం నేరమని పోలీసులు తెలిపారు.

అందుకే ఈ ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్‌లు అమర్‌నాథ్, మాబు, హరికృష్ణలను నిందితులుగా చేర్చారు. అయితే, బంక్ నిర్వహిస్తున్న బత్తల హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×