E-Paper
Advertisement

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: రైతన్నల కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న లక్ష్యంతో రైతుల కోసం పీఎం కిసాన్ నగదును జమ చేస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేక లబ్ది పొందలేక పోతున్నారని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం 2019లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం దేశంలోని రైతులందరికీ లబ్ది చేకూర్చేందుకు పథకం అమలు చేస్తోంది. అందుకే రైతులు పథక లబ్ది కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.

ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2 వేలు జమ చేస్తారు. అయితే అందుకు రైతన్నలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే రైతుల ఖాతాలలో నగదు జమ కావడం ఖాయం. అయితే పీఎం కిసాన్ 19 వ విడత నగదును కేంద్రం ఫిబ్రవరిలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇంకా చాలా మంది రైతులు ఈ కేవైసీ పై సరైన అవగాహన లేక సరైన సమయానికి చేయించుకోక పోవడంతో, నగదు జమ కాలేదని చెప్పవచ్చు. అటువంటి రైతులందరూ ఈనెల 31 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అప్పుడే 19 వ విడతలో జమ అయ్యే రూ. 2 వేల నగదు ఖాతాకు చేరుతుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కేంద్రం ప్రకటించింది. అయితే సులభ పద్దతిలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని, అందుకు pmkisan.gov.in సైట్ లో సులభంగా ఈ కేవైసీ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సైట్ ఓపెన్ చేసిన అనంతరం, కుడివైపున ఉండే ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది.

Also Read: Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే, మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేందుకు ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే, ఈ కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఇంకా ఈకేవైసీ పై ఏవైనా సందేహాలు ఉంటే, తప్పనిసరిగా స్థానిక మీసేవ సెంటర్లను సంప్రదించాలని రైతన్నలను కేంద్రం కోరింది. మరి మీరు 19వ విడత పీఎం కిసాన్ నగదు కోసం వేచి ఉన్నారా.. ముందు ఈ కేవైసీ చేయించుకున్నారో లేదో చెక్ చేయండి. లేకుంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఈ ప్రక్రియకు ఈనెల 31వరకే గడువు.. మరచిపోవద్దు సుమా!

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×