BigTV English

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: పీఎం కిసాన్ నగదు జమ.. 31 లోగా ఈ ప్రక్రియ తప్పక పూర్తి చేయండి!

PM Kisan Scheme: రైతన్నల కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న లక్ష్యంతో రైతుల కోసం పీఎం కిసాన్ నగదును జమ చేస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేక లబ్ది పొందలేక పోతున్నారని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం 2019లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం దేశంలోని రైతులందరికీ లబ్ది చేకూర్చేందుకు పథకం అమలు చేస్తోంది. అందుకే రైతులు పథక లబ్ది కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.


ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2 వేలు జమ చేస్తారు. అయితే అందుకు రైతన్నలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే రైతుల ఖాతాలలో నగదు జమ కావడం ఖాయం. అయితే పీఎం కిసాన్ 19 వ విడత నగదును కేంద్రం ఫిబ్రవరిలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇంకా చాలా మంది రైతులు ఈ కేవైసీ పై సరైన అవగాహన లేక సరైన సమయానికి చేయించుకోక పోవడంతో, నగదు జమ కాలేదని చెప్పవచ్చు. అటువంటి రైతులందరూ ఈనెల 31 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అప్పుడే 19 వ విడతలో జమ అయ్యే రూ. 2 వేల నగదు ఖాతాకు చేరుతుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కేంద్రం ప్రకటించింది. అయితే సులభ పద్దతిలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని, అందుకు pmkisan.gov.in సైట్ లో సులభంగా ఈ కేవైసీ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సైట్ ఓపెన్ చేసిన అనంతరం, కుడివైపున ఉండే ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది.


Also Read: Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే, మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేందుకు ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే, ఈ కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఇంకా ఈకేవైసీ పై ఏవైనా సందేహాలు ఉంటే, తప్పనిసరిగా స్థానిక మీసేవ సెంటర్లను సంప్రదించాలని రైతన్నలను కేంద్రం కోరింది. మరి మీరు 19వ విడత పీఎం కిసాన్ నగదు కోసం వేచి ఉన్నారా.. ముందు ఈ కేవైసీ చేయించుకున్నారో లేదో చెక్ చేయండి. లేకుంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఈ ప్రక్రియకు ఈనెల 31వరకే గడువు.. మరచిపోవద్దు సుమా!

Related News

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Big Stories

×