BigTV English
Advertisement

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని ప్రధాని మోదీ అన్నారు. 101వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమయంలో శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతోపాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారని గుర్తు చేశారు.


బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్నారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు.

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని మోదీ అన్నారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజలతో మమేకం చేయడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.


Related News

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Big Stories

×