BigTV English

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని ప్రధాని మోదీ అన్నారు. 101వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమయంలో శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతోపాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారని గుర్తు చేశారు.


బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్నారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు.

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని మోదీ అన్నారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజలతో మమేకం చేయడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.


Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×