Mamata Attack: పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బీజ్పూర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం అయిన మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు దాడి చేసిన ఘటన కలకలం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అయితే బీజాపూర్లోని పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త అయిన బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జి బయలు దేరారు. దీంతో ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ఆమే కారుపై దాడి చేసారు.
‘చోర్.. చోర్’ అంటూ నినాదాలు చేస్తూ మమతా బెనర్జీ కారుపై రాళ్లు, పాదరక్షలు, నీళ్ల బాటిళ్లు, బురదను నిరసనకారులు విసిరారు. పోలీసులు చూస్తుండగానే అసాంఘిక శక్తులు తన కారుపై పెద్ద రాళ్లతో దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని, ప్రాణాపాయం జరిగి ఉండేదని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read: 20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?
తన పర్యటన గురించి ముందే సమాచారం ఇచ్చినప్పటికీ, పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని, పోలీసుల వైఫల్యం వల్లే ఇది జరిగిందని మమతా బెనర్జీ తెలిపారు. కావాలనే నాపై దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ హింసతో తమకు ఎలాంటి సంబంధం లేదని అటు బెంగాల్ బీజేపీ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసన కారులను చెల్లాచెదురు చేసారు.
Also Read: మహారాష్ట్రలో ఘోరం.. రన్వేపై కుప్పకూలిన ట్రైనీ విమానం!