Locust Swarms: రష్యాలోని దాగెస్తాన్, కల్మికియా ప్రాంతాల్లో మిడతల దండు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. వాతావరణ మార్పులు, విపరీతమైన ఎండల కారణంగా వీటి సంతతి అమాంతం పెరిగిపోయింది. లక్షలాదిగా వస్తున్న ఈ రాక్షస కీటకాలు.. పంటలను క్షణాల్లో ఆరగిస్తూ రైతులను కన్నీట ముంచుతున్నాయి. గాలి వీచే దిశను బట్టి ఇవి రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తున్నాయి. పరిస్థితి చేయిజారిపోతుండటంతో రష్యా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
మిడతల దండు గాలి వాలును బట్టి ఆసియా దేశాల వైపు మళ్లుతుందా అన్న ఆందోళన మొదలయింది. 2020లోనూ ఇలాగే వచ్చిన మిడతలు.. వాయువ్య భారతాన్ని అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే కావాల్సినంత వర్షాలు కురవక, సాగు నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారు. పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్న విపత్కర పరిస్థితుల్లో.. ఒకవేళ ఈ మిడతలు కూడా భారత్పై దాడి చేస్తే మన రైతాంగం కోలుకోవడం కష్టం అవుతుంది.
Also Read: తెలంగాణ జాతిపిత కేసీఆర్..! మళ్లీ కేటీఆర్ నోటి వెంట ఫాదర్ ఆఫ్ తెలంగాణ కామెంట్స్..
ప్రకృతి విపత్తులకు తోడు ఇలాంటి కీటకాల దాడులు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. రష్యాను వణికిస్తున్న ఈ మిడతల దండు భారత్ సరిహద్దుల వైపు రాకుండా వాతావరణ పరిస్థితులు అడ్డుకోవాలని ఆశిద్దాం. అధికారులు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ!