Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మెడికల్ విద్యార్థిని కార్తో దారుణంగా ఢీకొన్న తాగుబోతులకు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించాలని రాజమండ్రి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మొదటగా యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సెక్షన్స్ ఆర్డర్ చేసి ఐపిసి 308 బి ఎం ఎస్ 110 కింద సెలెక్షన్లను ఈ కేసును బదలాయించారు. నిందితులు దస్వంత్, జోసెఫ్ ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ కోర్టు విదించింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఇదెక్కడి వింత.. సముద్రంలా మారిన బావి.. ఎగసిపడుతున్న అలలు!
మద్యం మత్తు క్షణికావేశం ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ ని ఇంత చిన్న చిన్న పదాలతో తేల్చి చెప్పడానికి మనసొప్పడం లేదు. కారణం వీరి నిర్వాకం కాస్తా ఒక నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. ఈ ఘటన జరిగింది రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర. మందుకొట్టిన మత్తోన్మాదుల వల్ల బలై పోయిందో ఫ్యూచర్ డాక్టర్. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించారు దీంతో ఆ యవతి మృతి చెందింది.
Also Read: రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు