E-Paper
Advertisement

రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు

రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు
Advertisement

Mustafa Arrest: వ్యాపార లావాదేవీలకు సంబంధించిన గొడవను రాజకీయం చేసి ముస్తఫా పై కేసులు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. ముస్తఫా, ఆయన కుమారుడికి బెయిల్ రాకుండా కావాలనే తీవ్రమైన సెక్షన్లు మోపారని ఫైర్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసులతో సహా పలు అక్రమ సెక్షన్లను ఇందులో అక్రమంగా చేర్చారని ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తిపై ఇలా చేయడం దారుణం అని అన్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ముస్తఫా పై ఇటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం వరుసగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

Also Read: అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!

కాకాణి గోవర్థన్ రెడ్డి..

Advertisement

వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఆనవాయితీగా మార్చుకుందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి తరఫున పనిచేసిన మాజీ మంత్రులు, శాసనసభ్యులను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా నేను, నా సహచర మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారుడిపై కేసులు..

నెల్లూరు సెంట్రల్ జైలుకు వరుసగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులను తరలించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన మృదు స్వభావి, వివాద రహితుడైన ముస్తఫా పై అక్రమ కేసులు బనాయించారు. ముస్తఫాతో పాటు ఆయన కుమారుడిపై కూడా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. అక్రమ కేసులో అరెస్ట్ అయిన ముస్తఫాని, ఆయన కుమారుడిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చామని అన్నారు. జైల్లో ముస్తఫా ధైర్యంగా ఉన్నాడని తెలిపారు.

Advertisement

Also Read: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి- మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Tags

Related News

చంద్రబాబూ.. మీ అబ్బాయిని కాపాడుకోడానికేనా ఇదంతా?.. సంచలన వీడియో షేర్ చేసిన జగన్!

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, నిలిచిన రాకపోకలు!

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

Big Stories

Advertisement
×