BigTV English

Krishna Delta : ఖరీఫ్ సీజన్‌ .. కృష్ణా డెల్టాకు నెల ముందే నీరు విడుదల..

Krishna Delta : ఖరీఫ్ సీజన్‌ .. కృష్ణా డెల్టాకు నెల ముందే నీరు విడుదల..


Krishna Delta : ఖరీఫ్ సీజన్‌లో నెలముందుగానే కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని మంత్రి అంటి రాంబాబు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. పూలు, పళ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు గతంలో జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో నీరు వదిలేవారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల ముందే నీటిని విడుదల చేశామన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభమైతే 3 పంటలు పండే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 34 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.


పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు తెచ్చే అవసరం లేదని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్, జగన్‌ పాలనలో వర్షాలు బాగా పడతాయని రుజువైందని చెప్పారు.

రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో దేవుడు కరుణించాడని చెప్పారు. వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా మారాయన్నారు. రైతులకు పంటలు బాగా పండి మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. వైఎస్ హయాంలో పులిచింతల పనులు పూర్తి చేశారని తెలిపారు. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతోందన్నారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×