E-Paper
Advertisement

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?
Advertisement

Swaroopananda’s Security: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని టీడీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన అనవసర ఖర్చులను బయటకు తీస్తోంది. వైసీపీ నేతలే కాదు, జగన్ సన్నిహితులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఉంది. అలాంటివారిలో స్వరూపానంద స్వామి ఒకరు.

జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు స్వరూపానంద స్వామి. రిషికేష్ తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడి పండితులతో హోమాలు చేశారాయన. స్వరూపానంద చేసిన పూజలు ఫలించాయి. అన్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చేసింది. అన్నట్లు స్వామికి చేయాల్సినదంతా చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.

Advertisement

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. వైసీపీ హయాంలో స్వరూపానందకు వై కేటగిరీ భద్రత కల్పించారట. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న స్వరూపానందస్వామి పీఠానికి నలుగురు గన్‌మెన్లు, ఆరుగురు సిబ్బందితో పికెట్ నిర్వహించేవారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ఏఎస్ఐ స్థాయిని అధికారిని నియమించారు. తరచూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి స్వామి సేవలో తరించేవారు.

ఈ సౌకర్యాల కోసం ప్రతి నెల ప్రభుత్వం 15 నుంచి 20 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు శారదా పీఠం కోసం ప్రత్యేకంగా కొంత భూమి కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే చాలామంది వైసీపీ నాయకులకు ఈ తరహా సౌకర్యాలు లేవు. తిరుమల వెళ్లినప్పుడు కూడా వీఐపీ తరహాలో స్వామి అక్కడికి వెళ్లివారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్వరూపానందస్వామి భద్రతను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ లెక్కలు బయటకు తీసే పనిలోపడింది.

Advertisement

ALSO READ: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ

ఎన్నికల ఫలితాలు రాగానే స్వారూపానంద స్వామి మాట మార్చారు. సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఎవరికీ భయపడి మీడియా సమావేశం పెట్టలేదని, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారని వివరించారు. సీఎం చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని కోరారు. సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. అమరావతిలో శారదా పీఠం నిర్మిస్తామని మనసులోని మాట బయట పెట్టారు స్వరూపానందస్వామి.

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×