E-Paper
Advertisement

జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!

జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!
Advertisement

Tadipatri Liquor: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలుగుచూసిన గోవా మద్యం కేసు రాజకీయంగానూ, శాంతిభద్రతల పరంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. జగన్ వ్యాఖ్యలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించడమే కాకుండా, పోలీసుల సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

Advertisement

జగన్ చేసిన ఆరోపణలను తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ప్రాంతంలో లారీలతో అక్రమ మద్యం రవాణా జరుగుతోందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన పిలుపునిచ్చారు. దీంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది. అయితే, సీఐలు ఆరోహణరావు, నారాయణరెడ్డి ఆయనతో మాట్లాడి కేసు పురోగతిని వివరించారు. దర్యాప్తు జరుగుతున్న వేళ పోలీసులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో, సిఐల సూచన మేరకు జేసీ తన ధర్నాను విరమించుకున్నారు.

ముగ్గురి అరెస్ట్ .. విచారణ ముమ్మరం

Advertisement

ఈ గోవా మద్యం కేసులో పోలీసులు ఇప్పటికే రామాంజనేయులు రెడ్డి, మాధవ, లక్ష్మీకాంతరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో మరికొంతమంది కీలక పాత్రధారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారించి, తప్పు చేసిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక

పోలీసుల హామీతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. కొద్ది రోజుల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి, అక్రమ మద్యంతో సంబంధం ఉన్న అసలు నిందితుల పేర్లను బహిరంగంగా వెల్లడించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.

Also Read: వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Tags

Related News

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

నెల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన.. తండ్రిని పట్టించిన ఐదేళ్ల బుడతడు, కార్డన్ సెర్చ్‌లో ట్విస్ట్

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?

ఆర్టీసీ ఉద్యోగులకు దిమ్మతిరిగే స్కాం చేసిన క్లర్క్.. 30 లక్షలతో ఉద్యోగి పరార్!

స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు!

తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!

Big Stories

Advertisement
×