E-Paper
Advertisement

Talliki Vandanam Scheme: మీకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? కారణం ఇదే కావచ్చు..!

Talliki Vandanam Scheme: మీకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? కారణం ఇదే కావచ్చు..!
Advertisement

Talliki Vandanam Scheme: గత నెల నుంచి చాలామంది తల్లులు ఎదురు చూశారు తల్లికి వందనం పథకంలో వచ్చే డబ్బుల కోసం. బ్యాంక్‌కి వెళ్తే ఖాతాలో డబ్బులు లేవు. ఇంకొందరైతే చెక్ చేసుకునేందుకు సరైన సమాచారం లేకుండానే అయోమయంలో పడుతున్నారు. పథకానికి అర్హులైనప్పటికీ తమకు డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. ఇక కొందరు మాత్రం.. హమ్మయ్య మా డబ్బులు మాకు వచ్చేశాయి అంటూ తెగ సంబర పడిపోతున్నారు. అయితే డబ్బులు జమ కాకపోవడానికి మరి అసలు సమస్య ఏమిటి? ఎవరు ఏం చేయాలి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం వల్లేనా సమస్య?
ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో కొందరి పేర్ల పక్కన అనర్హుడు.. 300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం అని మెరుపుగా దర్శించడంతో చాలామంది షాక్ అయ్యారు. వీరిలో చాలామంది నిజంగా అర్హులే. కానీ వారి డేటాలో చిన్న పొరపాటుతోనే ఈ తప్పు జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన డేటాలో తేడాలు ఉండటంతో 300 యూనిట్లకు పైగా వినియోగించినట్టు చూపించబడిందని భావిస్తోంది.

Advertisement

NBM డేటా అప్డేట్ చేసుకున్నవారికి క్లారిటీ వచ్చేసింది
ఇటీవల అధికారుల సమీక్ష అనంతరం ఇదొక డేటా తప్పిదమేనని తేలింది. ఇప్పటికే తమ డేటాను NBM (National Beneficiary Management System) ద్వారా అప్డేట్ చేసుకున్న వారికి అనర్హత ట్యాగ్ తొలగించబడుతోంది. ఈ సమాచారం సచివాలయ అధికారులు చెబుతున్నారు. డేటా కరెక్ట్ చేసుకున్న వారికి వచ్చే 2, 3 రోజుల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

పేరు జాబితాలో ఉందా? లేదా? తొందరగా తెలుసుకోండి
అరచేతిలో ఆధార్ ఉండి కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎందుకు రావడం లేదని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రధాన కారణం.. వారికి అన్నదాత సుఖీభవ లాంటి ఇతర పథకాల జాబితాలో పేరు ఉండవచ్చు, కానీ తల్లికి వందనం స్కీమ్‌లో ఉండకపోవచ్చు. అందుకే మీరు వెంటనే మీ ఆధార్ కార్డ్‌తో దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. పేరు ఉంటే ఓకే, లేకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టండి.

Advertisement

వేరే కారణాల వల్ల కూడా అనర్హులుగా మారుతున్నారా?
300 యూనిట్ల సమస్య కంటే ఇతర కారణాల వల్ల కూడా చాలామంది అనర్హుల జాబితాలోకి వెళ్లిపోతున్నారు. ఉదాహరణకు బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ కాకపోవడం, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ కావడం లేదు, రెవెన్యూ రికార్డుల్లో తప్పు వివరాలు ఉండటం, రెండోసారి పేరు నమోదు కావడం వల్ల డూప్లికేట్‌గా తిరస్కరించబడటం.. ఈ సమస్యలు ఉంటే మీరు తప్పనిసరిగా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం వద్ద గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వాలి.

Also Read: Annadata Sukhibhava 2025: రైతులకు లాస్ట్ ఛాన్స్.. రూ. 20 వేలు జమ అయ్యేందుకు ఇలా చేయండి!

గ్రీవెన్స్ ఎలా వేయాలి? సింపుల్ ప్రాసెస్ ఇది
మీరు తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి గల కారణం ఏదైనా ఐతే.. ముందు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి. వారు మీ NBM డేటా చెక్ చేస్తారు. సమస్య ఉంటే మీరు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, విద్యుత్ బిల్లు, మొబైల్ నంబర్ వంటి డాక్యుమెంట్లతో మున్సిపల్ లేదా మండల కార్యాలయంలో అప్లై చేయాలి. అక్కడి అధికారులు మీ WEA / WWDS లేదా DA / WEDS ద్వారా SOP ప్రకారం అప్లోడ్ చేస్తారు. మీకు ఒక గ్రీవెన్స్ ID లభిస్తుంది. దాని ద్వారా మీరు మీ సమస్యను ట్రాక్ చేయవచ్చు.

తల్లులకు ముందుగానే సమాచారం ఇవ్వాల్సిన అవసరం
చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు డిజిటల్ సమాచారం అందదు. వాళ్లకు ఈ వివరాలు ఎవరో చెబితేనే తెలుసుతుంది. పేరు జాబితాలో ఉందా? డబ్బులు జమ అయ్యాయా? లేకపోతే సమస్య ఏంటి? ఇవన్నీ ముందుగానే చెబితే తల్లులు వేరే వారి దగ్గరకు తిరుగుతూ ఇబ్బంది పడకుండానే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందగలుగుతారు.

ఇక డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..?
అధికారుల ప్రకారం 300 యూనిట్ల కారణంగా తప్పుగా అనర్హులుగా నిలబెట్టబడ్డవారి డేటాను ఇప్పటికే రీ-వాలిడేట్ చేశారు. ఈ వారంలో లేదా వచ్చే వారం ప్రారంభంలో వాళ్ల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశముంది. ఇక ఇతర కారణాల వల్ల అనర్హులుగా మారినవారు గ్రీవెన్స్ పెడితే వాళ్ల సమస్యలు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తల్లికి వందనం ఒక గొప్ప పథకం. ప్రభుత్వం తల్లుల మాతృత్వానికి సెల్యూట్ చేస్తున్నట్లే ఈ పథకం రూపకల్పన జరిగింది. చిన్న చిన్న డేటా పొరపాటులతో ఈ వందనం మిస్ అవ్వకూడదు. మీరు అర్హులు అయితే, మీ హక్కును సాధించండి. ఇప్పుడు సమస్య ఉందంటే.. వెంటనే అధికారులను సంప్రదించండి, గమనించండి, స్పందించండి. మీ ఖాతాలో రూ. 13 వేలు జమ కావడం ఖాయం. ఇద్దరు ఉంటే 26 వేలు పడడం గ్యారంటీ.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×