BigTV English
Advertisement

Chandrababu @ Kuppam: వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..!

Chandrababu @ Kuppam: వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..!
Chandrababu
Chandrababu
Chandrababu Kuppam Tour: కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని సీఎం వైఎస్ జగన్ యువతను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రం డీఎస్సీ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్‌-1 ఉద్యోగాలను నచ్చినవారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు.
ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సర్వే నంబర్స్ మార్చి ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గం కప్పుంలోనూ తనకు బెదిరింపులు తప్పటం లేదన్నారు. ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు.
ఏపీలో ఖనిజ సంపదను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మండిపడ్డారు. ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు.
కేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. టెండర్స్ లోనూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వారి జీవితాలు మారుస్తామన్నారు.


Related News

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Big Stories

×