E-Paper
Advertisement

TDP Complaints to EC on YCP: చంద్రబాబు ఇంటర్వ్యూ.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. ఫేక్ వీడియో వెనుక..

TDP Complaints to EC on YCP: చంద్రబాబు ఇంటర్వ్యూ.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. ఫేక్ వీడియో వెనుక..

TDP Complaints to EC on YCP Social Media: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముందురోజు వైసీపీ అరాచకాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీపై వైసీపీ సోషల్‌మీడియా నెగిటివ్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇంకోవైపు ఓటర్ల చేత గుడిలో వైసీపీ నేత ప్రమాణం చేయించడం వంటి పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ.

తాజాగా చంద్రబాబు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూపై వైసీపీ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమ.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

ఇంటర్వ్యూలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు అన్నట్లు మార్పింగ్ చేసిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారాయన.

Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

ఈ ప్రచారం వెనుక వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అందులో ప్రస్తావించారు. అంతేకాదు నకిలీ వీడియో ప్రచారం కాకుండా అడ్డుకోవాలని కోరారు ఉమ.

మరోవైపు తిరుపతిలోని కొర్ల గుంట ఆంజనేయస్వామి ఆలయంలో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణాలు చేయించారు.  తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కేతన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ మేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ముఖ్యంగా ఆటో సంఘాలకు చెందిన పలువురు నాయకులు కర్పూరం వెలిగించి తమ ఓటు, కుటుంబ, బంధువుల ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేస్తామంటూ ప్రమాణం చేయించారు.

Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ

గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేతం మాట్లాడిన వీడియో ఒకటి వివాదాస్పదమైంది. ఫేక్ పేపర్స్‌తో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేద్రాలకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని పిలుపునివ్వడం అప్పట్లో దుమారం రేపిన విషయం తెల్సింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×