E-Paper
Advertisement

MLA Gummanur Jayaram: ఎమ్మెల్యే గుమ్మనూరు శివతాండవం.. కొంతమందికి వార్నింగ్

MLA Gummanur Jayaram: ఎమ్మెల్యే గుమ్మనూరు శివతాండవం.. కొంతమందికి వార్నింగ్
Advertisement

MLA Gummanur Jayaram: ఏపీ రాజకీయాల్లోని వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకరు. పార్టీ ఏదైనా ఆయన వ్యవహారశైలి ఒక్కటే. తోటి నాయకులైనా, అధికారులైనా, చివరకు జర్నలిస్టులైనా తన నోటికి పని  చెబుతారు. ప్రస్తుతం అదే చేశారనుకోండి. తన గురించి, ఫ్యామిలీ గురించి తప్పుడు వార్తలు రాసిన కొందరు మీడియా జర్నలిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సదరు ఎమ్మెల్యే.

వైసీపీ ప్రభుత్వంలో బాగా ఫేమస్ అయ్యారు గుమ్మనూరు జయరాం. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి రావడం, గుంతకల్లు నుంచి గెలవడం జరిగిపోయింది. ఆయన నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా ఆయన శివతాండవం చేశారు.

Advertisement

కొందరు మీడియా జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. తనపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని మండిపడ్డారు. తనకు అన్నీ తెలుసని, తాను ఏదైనా చేస్తానని కాసింత ఆవేశంతో చెప్పుకొచ్చారు. తనపై, ఫ్యామిలీపై వార్తలు రాస్తే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా అంటే తనకు లెక్కలేదన్నది ఆయన మాట. తాను అన్ని చేసి వచ్చానని, ఏం రాసుకుంటారో రాసుకోండంటూ రుసరుసలాడారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తానని అన్నారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు.

Advertisement

ALSO READ:  విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్స్

భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు.. వీటన్నింటినీ నిరూపించాలని, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ కాసింత జోరు జారారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఏపీలో కూటమి సర్కార్ వచ్చి ఆరునెలలు పైగానే గడిచింది. ఇంతలోనే జయరాం ఈ స్థాయిలో ఫైరయిన సందర్భాలు లేవన్నది ఆయన మద్దతుదారుల మాట. రాబోయే రోజుల్లో ఆయన గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×