E-Paper
Advertisement

టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీ డబ్బులు గోవిందా!

టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే మీ డబ్బులు గోవిందా!
Advertisement

Tirumala Scam: తిరుమలలో భారీ దందాకు కొంత మంది కేటుగాళ్లు తెరలేపారు. నకిలీ ఆధార్ కార్డులతో వేరేవాల్ల రూములను మరో వ్యక్తులకు నకిలీ పత్రాలతో పొంది అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిన్న ఆగస్టు 16న ఓ గది పోందిని వ్యక్తి అదే గదిపై మరో వ్యక్తి మరో గుర్తింపు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ఓకే లైన్లో నిలబడుతూ ఉన్నారు. దీంతో అది గమనించిన సీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు విషయం బైటపడింది. విచారణలో భాగంగా కేరళ జిల్లాకు చెందిన ఆషిక్ అలీగా అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న రెండు నకిలీ ఆధార్ కార్డులుతో పాటు గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రూపులుగా ఏర్పడి..

అయితే పోలీసుల విచారణలో రంజిత్ అనే దళారీకి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు పోలీసులు విచారనలో ఆషిక్ అనే వ్యక్తి తెలిపాడు. దీంతో నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొంది వాటిని దళారీకి అప్పగించడం తన పనిగా చేసుకుని వాటిని వచ్చే భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ దందాలో కొంత మంది వ్యక్తులుర ఉన్నట్టు పోలీసులు గుర్తించి మిగతా వ్యక్తులపై పోలీసులు విచారన చేపట్టారు. విచారణలో భాగంగా తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read: OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..!

పోలీసులు అలర్ట్.. 

తిరుమలకు వచ్చే భక్తులు దళారుల ద్వారా గదులు కొనుగోలు చేయవద్దని ఆధార్, ఫోటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అక్కడి వ్యక్తులకు ఎట్టిపరిస్ధితుల్లోను ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. భక్తుల వసతికోసం సీఆర్‌ఓ కౌంటర్లు, లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు భక్తులకు తెలిపారు.

హెల్ప్ లైన్ నంబర్లు..

Advertisement

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో ఇతరుల పేర్లపై గదులు పొంది, అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుమల భక్తులకు పోలీసులు అలర్ట్ చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 9866898630, 155257కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Also Read: డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!

Tags

Related News

ఏపీ అసెంబ్లీలో ఆటో మ్యుటేషన్ బిల్లు ఆమోదం!

‘డీఎస్సీపై అసత్యాలు ఆపండి’.. అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్!

మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!

అసెంబ్లీకి పవన్ ఎందుకు రాలేదు? క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల!

డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు బ్రేక్.. ఉద్యోగుల్లో తీవ్ర భావోద్వేగం!

Big Stories

Advertisement
×