BigTV English
Advertisement

Kiran Royal vs Roja: మాజీ మంత్రి రోజాకు ఇక కష్టాలే? శ్రీరెడ్డి నీతులు ఇప్పుడెందుకు? కిరణ్ రాయల్ కామెంట్స్

Kiran Royal vs Roja: మాజీ మంత్రి రోజాకు ఇక కష్టాలే? శ్రీరెడ్డి నీతులు ఇప్పుడెందుకు? కిరణ్ రాయల్ కామెంట్స్

Kiran Royal vs Roja: మాజీ మంత్రి రోజాకు కష్టాలు తప్పవా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనా.. టూరిజం స్కామ్ లో సీఐడీ విచారణ సాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. రోజా భవిష్యత్ ఏంటి అంటే.. నగరి జైలుకే పంపిస్తాం అంటున్నారు తిరుపతికి చెందిన జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్.


గత ప్రభుత్వ హయాంలో టూరిజం స్కామ్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఇప్పటికే కూటమి నేతలు విమర్శల పర్వం సాగిస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో సైతం స్వయంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టూరిజం శ్రీవారి దర్శనం టికెట్లలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు టూరిజం టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ కిరణ్ రాయల్ మరోమారు టూరిజం స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం స్థానికులకు దర్శనభాగ్యం కల్పించలేదని, తిరుమలలో శారదాపీఠం అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టిందని, ఆ భవనాన్ని కూల్చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం శుభపరిణామమన్నారు. టీటీడీ జారీ చేసే టూరిజం టికెట్స్ వల్ల రూ.400 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్న పాలకమండలి సమావేశంలో నిర్ణయాలన్నీ ఆ శ్రీనివాసుడే చెప్పించినట్లుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. టూరిజం స్కామ్‌లో సీఐడీ విచారణ చేపట్టి.. రోజాను నగరి జైలుకే పంపిస్తామని విమర్శించారు.


Also Read: Ap School Timings: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి పాఠశాలల పని వేళల్లో మార్పులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

ఇక శ్రీరెడ్డి గురించి మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిన మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు సారీలు చెబుతోందన్నారు. శ్రీరెడ్డి నోటి మాటల్లో ఇప్పుడున్నంత ఆవేదన నాడు లేదన్నారు. అందుకే ఏదైనా మాట్లాడే సమయంలో ఆలోచించి మాట్లాడాలని, అన్నీ చేసి ఇప్పుడు సారీలు చెప్పడం దేనికి సంకేతమన్నారు. హద్దులు దాటిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీ రెడ్డిలో వణుకు మొదలై సన్యాసి వేషం వేస్తోందన్నారు.

మొత్తం మీద కిరణ్ రాయల్ మాటలను బట్టి మాజీ మంత్రి రోజాకు ఇక చిక్కులేనని రాజకీయ విమర్శకులు తెలుపుతున్నారు. అలాగే సీఐడీ విచారణ సాగితే, అసలు కథ బయటపడితే.. ఆ తర్వాత చర్యలు తప్పవని జనసేన నేతలు అంటున్నారు.

Related News

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×