E-Paper
Advertisement

Trolls on Pawan Kalyan: తిరుమల లడ్డుపై పవన్ వ్యాఖ్యలు చేసిన 108 రోజుల్లోనే ఇలా..?

Trolls on Pawan Kalyan: తిరుమల లడ్డుపై పవన్ వ్యాఖ్యలు చేసిన 108 రోజుల్లోనే ఇలా..?
Advertisement

Trolls on Pawan Kalyan: మూడు నెలల క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ఎంత తీవ్ర దుమారం రేగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వినియోగించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ ఓ రేంజ్‌లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ నాణ్యత రుచి పై పలు రకాలుగా పవన్ మాట్లాడారు.

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టులో తేలిందని కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడారు. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారని ఫైరయ్యారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? అని సమయంలో ప్రశ్నించారు. ఈ ఘటనను సహించేది లేదని తెలిపారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు అని డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు.

Advertisement

అయితే.. నిన్న తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారక దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూపై మాట్లాడిన 108 రోజుల తర్వాత తిరుమలలో అపశృతి జరిగిందని పలువురు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్.. మళ్లీ సరిగ్గా 108 డేస్ తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాడని.. దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు.

Also Read: Pawan Kalyan : తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం పూర్తిగా రద్దు చేయాల్సిందే..

Advertisement

తిరుమల లడ్డూపై ఎలాంటి కల్తీ జరగకపోయినా.. కూటమి నేతలు క్రియేట్ చేశారని.. తిరుమల స్వామి వారు నిత్యం గమనిస్తూనే ఉంటారని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లడ్డూ విషయంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ ఎలాంటి తప్పుడు పని చేయలేదని.. వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×