BigTV English
Advertisement

Heavy Rains in AP: ఏపీకి మరో భారీ వర్షసూచన.. ఆ రోజుల్లో దంచుడే దంచుడు.. తస్మాత్ జాగ్రత్త సుమా!

Heavy Rains in AP: ఏపీకి మరో భారీ వర్షసూచన.. ఆ రోజుల్లో దంచుడే దంచుడు.. తస్మాత్ జాగ్రత్త సుమా!

Heavy Rains in AP: ఏపీకి మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆయన తెలిపారు.


దక్షిణ అండమాన్ సముద్రం లో నవంబర్ 21వ తేదీన ఆవర్తనం ఏర్పడుతుందని, దీనితో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో ఈనెల 27, 28వ తేదీలలో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల రైతులు, ప్రజలు గమనించాలని కోరారు.

వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుండే వ్యవసాయ పనులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు. పలు జిల్లాలలో వరి సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ కార్యకలాపాలను ముందస్తుగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురిసిన యెడల, సాగు భూమిలోనే పంట నేలకు ఒరుగుతుందని, అటువంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ముందస్తుగా వర్ష సూచన గురించి ప్రకటించింది.


Also Read: Big TV Effect: బిగ్ టీవీ పోస్ట్ కు స్పందించిన మంత్రి లోకేష్.. కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులకు ఆపన్నహస్తం..

అలాగే 27, 28 తేదీలలో వర్షం కురుస్తున్న వేళ విద్యుత్ మోటార్ల వద్దకు రైతులు వెళ్లకపోవడమే మంచిదని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్త వహించాలన్నారు. ఇప్పటికే ఏపీకి భారీ వర్ష సూచనపై ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించామని, అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా అప్రమత్తమవుతుందన్నారు. రైతులారా తస్మాత్ జాగ్రత్త.. భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. మీ పంట రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోండి సుమా!

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×