E-Paper
Advertisement

Union Minister Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన చెందొద్దు..కుమారస్వామి

Union Minister Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన చెందొద్దు..కుమారస్వామి
Advertisement

Union Minister Kumaraswamy on Vizag Steel Plant(AP latest news): విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడం మా బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనేక కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయని, ప్లాంట్ మూత పడుతుందనే ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఎంతోమందికి బతుకునిచ్చే ఇలాంటి ప్లాంట్‌లను రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వందశాతం సామర్థ్యంలో ఉత్పత్తి జరుగుతుందని మంత్రి కుమార స్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ భాగాలను పరిశీలించారు. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కొంతమంది కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

కేంద్రమంత్రి కుమార స్వామి గురువారం ఉదయం విశాఖకు చేరుకున్న అనంతరం సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ప్లాంట్ ఆద్యంతం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ పేరు ఎత్తకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందన్నారు.

Also Read: గత పాలకులు వీరప్పన్ వారసులు.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

ఇదిలా ఉండగా, ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇప్పట్లో ముందుకెళ్లడం లేదని అన్నారు. అయితే తాజాగా, కుమారస్వామి ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తగు సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు, పరిణామాలు.. కార్మికులు, ఉద్యోగాల్లో భరోసా నింపుతున్నాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×