E-Paper
Advertisement

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ

Chandrababu Govt: సీఎం చంద్రబాబు రూటు మార్చారు. నేతలు, కేడర్‌లో అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా ఏడాదిలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అవన్నీ గమనించిన ముఖ్యమంత్రి పక్కాగా స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతల మాట.

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా వ్యవసాయ మార్కెట్‌లో కీలకమైన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది. 66 కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల ద్వారా వివిధ వర్గాలకు చెందిన మహిళలకు పెద్దఎత్తున అవకాశం కల్పించింది.

ఛైర్మన్ పదవుల నియామకాల్లో రాజకీయ సమతుల్యత, సామాజిక న్యాయాన్ని పాటించింది. 66 ఏఎంసీలలో ఛైర్మన్ పదవుల్లో టీడీపీ-52, జనసేన-10, బీజేపీకి నాలుగు పదవులు కేటాయించింది. ఎప్పటిమాదిరిగానే ఛైర్మన్ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించారు సీఎం చంద్రబాబు. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చారు.

బీసీ వర్గానికి-17, ఎస్సీలకు-10, ఎస్టీలకు-5, మైనారిటీలకు- 5 ఛైర్మన్ల పదవులను కేటాయించారు. సమాజంలోని అన్నివర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 66 ఛైర్మన్ పదవుల్లో 35 చోట్ల మహిళలకు దక్కాయి. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు కీలకపాత్ర పోషించనున్నారు.

ALSO READ: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి లాభమా, నష్టమా?

వీటి ద్వారా మహిళలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం, రైతులకు-వ్యాపారులకు మధ్య వారధిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు ఉంటాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. మహిళలకు ఈ స్థాయిలో పదవులు దక్కడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే గమనించిన సీఎం చంద్రబాబు, మహిళలకు పెద్ద పీఠ వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మహిళలకు ఛైర్మన్ల పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి అడుగులు వేసిందని అంటున్నారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×