BigTV English

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ
Advertisement

Chandrababu Govt: సీఎం చంద్రబాబు రూటు మార్చారు. నేతలు, కేడర్‌లో అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా ఏడాదిలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అవన్నీ గమనించిన ముఖ్యమంత్రి పక్కాగా స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతల మాట.


ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా వ్యవసాయ మార్కెట్‌లో కీలకమైన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది. 66 కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల ద్వారా వివిధ వర్గాలకు చెందిన మహిళలకు పెద్దఎత్తున అవకాశం కల్పించింది.

ఛైర్మన్ పదవుల నియామకాల్లో రాజకీయ సమతుల్యత, సామాజిక న్యాయాన్ని పాటించింది. 66 ఏఎంసీలలో ఛైర్మన్ పదవుల్లో టీడీపీ-52, జనసేన-10, బీజేపీకి నాలుగు పదవులు కేటాయించింది. ఎప్పటిమాదిరిగానే ఛైర్మన్ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించారు సీఎం చంద్రబాబు. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చారు.


బీసీ వర్గానికి-17, ఎస్సీలకు-10, ఎస్టీలకు-5, మైనారిటీలకు- 5 ఛైర్మన్ల పదవులను కేటాయించారు. సమాజంలోని అన్నివర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 66 ఛైర్మన్ పదవుల్లో 35 చోట్ల మహిళలకు దక్కాయి. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు కీలకపాత్ర పోషించనున్నారు.

ALSO READ: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి లాభమా, నష్టమా?

వీటి ద్వారా మహిళలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం, రైతులకు-వ్యాపారులకు మధ్య వారధిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు ఉంటాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. మహిళలకు ఈ స్థాయిలో పదవులు దక్కడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే గమనించిన సీఎం చంద్రబాబు, మహిళలకు పెద్ద పీఠ వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మహిళలకు ఛైర్మన్ల పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి అడుగులు వేసిందని అంటున్నారు.

 

Related News

Pithapuram Govt Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి.. విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

AP Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

CM Chandrababu: పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు.. యూఏఈలో వరుస భేటీలు

Bhimavaram DSP Issue: డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. భీమవరం డీఎస్పీ వెరీగుడ్ అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు

TDP On Tuni Incident: తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు.. తుని ఘటనపై టీడీపీ సంచలన పోస్ట్

Nara Lokesh Tour: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేశ్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు

Heavy Rains In AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

Big Stories

×