E-Paper
Advertisement

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ

Chandrababu Govt: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ
Advertisement

Chandrababu Govt: సీఎం చంద్రబాబు రూటు మార్చారు. నేతలు, కేడర్‌లో అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా ఏడాదిలోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈసారి మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అవన్నీ గమనించిన ముఖ్యమంత్రి పక్కాగా స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతల మాట.

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా వ్యవసాయ మార్కెట్‌లో కీలకమైన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది. 66 కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమించింది. ఈ పదవుల ద్వారా వివిధ వర్గాలకు చెందిన మహిళలకు పెద్దఎత్తున అవకాశం కల్పించింది.

Advertisement

ఛైర్మన్ పదవుల నియామకాల్లో రాజకీయ సమతుల్యత, సామాజిక న్యాయాన్ని పాటించింది. 66 ఏఎంసీలలో ఛైర్మన్ పదవుల్లో టీడీపీ-52, జనసేన-10, బీజేపీకి నాలుగు పదవులు కేటాయించింది. ఎప్పటిమాదిరిగానే ఛైర్మన్ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించారు సీఎం చంద్రబాబు. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చారు.

బీసీ వర్గానికి-17, ఎస్సీలకు-10, ఎస్టీలకు-5, మైనారిటీలకు- 5 ఛైర్మన్ల పదవులను కేటాయించారు. సమాజంలోని అన్నివర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఇచ్చారు. ఈ నియామకాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 66 ఛైర్మన్ పదవుల్లో 35 చోట్ల మహిళలకు దక్కాయి. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మహిళలు కీలకపాత్ర పోషించనున్నారు.

Advertisement

ALSO READ: పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు.. వైసీపీకి లాభమా, నష్టమా?

వీటి ద్వారా మహిళలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం, రైతులకు-వ్యాపారులకు మధ్య వారధిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు ఉంటాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. మహిళలకు ఈ స్థాయిలో పదవులు దక్కడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే గమనించిన సీఎం చంద్రబాబు, మహిళలకు పెద్ద పీఠ వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మహిళలకు ఛైర్మన్ల పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి అడుగులు వేసిందని అంటున్నారు.

 

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×