Yarada Beach: విశాఖ బీచ్లో సందర్శకులకు తప్పిన ప్రమాదం తప్పింది. సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ మహిళను రక్షించారు బీచ్ లైఫ్ గార్డ్స్. సముద్రస్నానం కోసం వెళ్లింది ఐదుగురు కుటుంబసభ్యులు. ఒక్కసారిగా అలల ఉధృతికి మునిగిపోతున్న మహిళను కాపాడారు. అసలేం ఏం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
విశాఖలోని యారాడ బీచ్లో ఓ టూరిస్టు ఫ్యామిలీకి పెను ప్రమాదం తప్పింది. స్నానానికి ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సముద్రంలో దిగారు. అయితే ఒక్కసారిగా అలల ఉధృతి తీవ్రమైంది. సమయంలో అలలతోపాటు ఓ మహిళ కొట్టుకుపోతోంది. మహిళను రక్షించాలంటూ కుటుంబసభ్యులు కేకలు పెట్టారు. వెంటనే బీచ్ లైఫ్గార్డ్స్ అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన లైఫ్గార్డ్స్.. సదరు ఆమెను రక్షించారు.
కాసేపటికి సదరు కుటుంబం వివరాలు చెప్పింది. తాము రైల్వే న్యూ కాలనీ ప్రాంతానికి చెందినవారమని తెలిపింది. కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సముద్రంలో స్నానానికి దిగామని, ఒక్కసారిగా అలల ఉధృతికి తీవ్రమైందని వెల్లడించింది. ఈ క్రమంలో 55 ఏళ్ల సూర్యలక్ష్మి నీటిలో మునిగి పోతుండడంతో లైఫ్గార్డ్స్ వెంటనే స్పందించారు. సముద్ర స్నానానికి వెళ్లినవారిలో లావరాజ్, వీర్రాజు, శ్రీను, వెంకటేష్లు ఉన్నారు. సముద్రంలోకి వెళ్లి సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు లైఫ్గార్డ్స్.
ALSO READ: తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల
సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని ఆ కుటుంబం చెప్పుకొచ్చింది. విశాఖలోని కీలకమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, లేకుంటే పోలీసులు మోహరిస్తున్నారు. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈతకు వెళ్ళరాదని పదేపదే బోర్డులు కనిపిస్తు్నాయి. హెచ్చరికలను విస్మరించి లోతు ప్రాంతాలకు ప్రమాదకరమని ఉంటున్నాయి. అయినా కొందరు ఆ విధంగా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెల్సింది.